Radhe Shyam: నిన్నటివరకు టాలీవుడ్ కి, AP ప్రభుత్వానికి మధ్యన జరిగిన రగడ గురించి అందరికీ తెలిసిందే. ఇక మొన్న అనగా ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల తరువాత కొత్త జీవో రావడం, టాలీవుడ్ జనాలు ఖుషి చేసుకున్న సంగతి తెలిసినదే. అయితే ఇపుడు కొత్త జీవో వచ్చేసింది అని ఆనందించాలో, బాధపడాలో తెలియని పరిస్థితిలో వున్నారు “రాధేశ్యామ్” నిర్మాతలు. ఈ నేపథ్యంలో RRR, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కూడా ఈ కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు అని తెలుస్తోంది.
Radhe shyam: అందరూ అనుకున్నది తప్పని ప్రూవ్ చేసిన ప్రభాస్..!
Radhe Shyam: విషయం ఏమిటి?
అయితే ఇక్కడ వచ్చే చిక్కు ఏమంటే, ఈ కొత్త జీవో వలన 100 కోట్లు దాటిన పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేదు. ఈ విషయమే ఇపుడు సినిమా నిర్మాతలను కలవరపెడుతోంది. మరోవైపు రేపు విడుదల కానున్న “రాధేశ్యామ్” సినిమాకు ఇంకా టికెట్స్ బుకింగ్స్ విడుదల కాకపోవడంతో డార్లింగ్ అభిమానులు తీవ్ర మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు.
Radhe Shyam: `రాధేశ్యామ్` భారీ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా?
జీవో 13 ఏం చెబుతోంది?
జీవో 13 ఏం చెబుతోందంటే, ఏపీలో 20 శాతం షూటింగ్ చేసుకున్న హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం కలదు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా వున్న పెద్దసినిమాలకు ఈ కొత్త జీవో వర్తిచకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఓ 10 రోజుల పాటు ధరలు పెంచుకొనే అవకాశం ఇవ్వాలి అంటూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ చుట్టూ ప్రొడ్యూసర్స్ తిరుగుతున్నట్టు భోగట్టా.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!