Ram Charan Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల `ఆర్ఆర్ఆర్`తో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాన్ని శంకర్తో చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
`ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. చకచకా షూటింగ్ను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైన అనంతరం రామ్ చరణ్ `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఈ మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంది. `ఆర్సీ 16` వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మితం కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. న్యాచురల్ స్టార్ నానితో `జెర్సీ` వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించి జాతీయ అవార్డు అందుకున్న గౌతమ్ తిన్ననూరి.. అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. అయితే ఇటీవలె విడుదలైన హిందీ జెర్సీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది.
దీని ప్రభావం గౌతమ్ తిన్ననూరి నెక్స్ ప్రాజెక్ట్ అయిన `ఆర్సీ 16`పై పడింది. పాన్ ఇండియాలో స్థాయిలో మార్కెట్ పెంచుకుంటున్న చరణ్.. గౌతమ్తో చేస్తే ఆ స్థాయి ప్రేక్షకులను రీచ్ అవ్వలేమని భావిస్తున్నాడట. అందుకే ఆయన గౌతమ్ తిన్ననూరితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆపేశాడంటూ వార్తలు మొదలయ్యాయి. మరోవైపు ఈ వార్తలు అవాస్తవమని, చరణ్-గౌతమ్ల ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజమో తెలియక అభిమానుల్లో గందరగోళం నెలకొంది.