Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి నిర్మిస్తున్నారు.
గత ఏడాదే షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ గ్రాండ్గా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఆదిపురుష్ బడ్జెట్ లీక్ అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లీక్ చేసింది మరెవరో కాదు.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన భూషణ్కుమార్. ఇంతకీ ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా.. అక్షరాలు రూ. 500 కోట్లు అట. ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా వెల్లడించడంతో.. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీంతో ఒక్క సినిమాకు అన్ని కోట్ల బడ్జెటా అంటూ నెటిజన్లు నోరెళ్లబడుతున్నారు.
మరోవైపు ఇది ఇప్పటి వరకు ఇండియాలో రూపొందిన చిత్రాల్లోనే అత్యధికమైన బడ్జెట్ అని అంటున్నారు విశ్లేషకులు. కాగా, పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు.