Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ చిత్రం నిర్మితం అవుతోంది.
నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ స్వరాలు అందిస్తున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేష్ లోన్ రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులే కాదు.. సినీ ప్రియులు సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందట. వచ్చే నెల విడుదల ఉన్నప్పటికీ.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అనుకున్నంత స్పీడ్గా షూటింగ్ జరగడంలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట మళ్లీ పోస్ట్ పోన్ అవ్వనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వార్తే నిజమైతే ఫ్యాన్స్కి తీవ్ర నిరాశ తప్పదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!