Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్యతో విడిపోయి నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్న సమంత.. కెరీర్పై ఫుల్ పోకస్ పెట్టి వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` పూర్తి చేసిన సమంత.. తమిళంలో విజయ్సేతుపతి, నయనతారతో కలిసి `కాతు వాకుల రెండు కాదల్` అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఫినిష్ చేసింది.
ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం హరీష్ శంకర్, హరీష్ నారాయణ్లు దర్శకత్వం వహిస్తున్న `యశోద`లో నటిస్తున్న సమంత.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో ఓ ద్వి భాషా చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అలాగే హిందీలోనూ పలు ప్రాజెక్ట్స్ను టేకప్ చేసిన సామ్.. తాజాగా ఓ బాలీవుడ్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు అజయ్ దేవగణ్. బాలీవుడ్కు చెందిన ప్రముక డైరెక్టర్ అజయ్ దేవగణ్తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్లో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందట. అయితే ఓ హీరోయిన్గా నటించాలని సమంతను ఇటీవల మేకర్స్ సంప్రదించగా.. ఆమె తన పాత్రకు మంచి ప్రాధన్యత ఉండటంతో వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు.
అలాగే ఈ మూవీకి సామ్ ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యులనరేషన్ డిమాండ్ చేసిందని.. అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు సైతం ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.