డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” గత నెల విడుదలయ్యి దారుణంగా పరాజయం పాలు కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. “లైగర్” ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తొలినాళ్ళల్లో ఇండియా షేక్ చేస్తామని విజయ్ దేవరకొండ తో పాటు డైరెక్టర్ పూరి.. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడటంతో..”లైగర్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కానీ తీరా రిజల్ట్ చూస్తే అసలు ఏమాత్రం అలరించలేకపోయింది. భారీగానే నష్టాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో “లైగర్” రిజల్ట్ పై తమ్మారెడ్డి భరద్వాజ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ఏ విషయంలో కూడా ఎగిరెగిరి పడితే ఇటువంటి ఫలితాలే వస్తాయని ఎటకారం చేశారు. ఎదురు దెబ్బలు తగులుతాయని పేర్కొన్నారు. సినిమా కోసం కష్టపడి పనిచేసే అందరూ తప్పకుండా చూడాలి అని ప్రమోషన్ టైంలో చెప్పుకుంటే పర్వాలేదు. కానీ చిటికలు వేస్తూ.. మాట్లాడితే ప్రేక్షకులు ఇచ్చే సమాధానం ఇలాగే ఉంటుందని అన్నారు.
“లైగర్” ట్రైలర్ చూసినప్పుడే తనకి సినిమా చూడాలని అనిపించలేదని చెప్పుకొచ్చారు. కానీ పూరీ జగన్నాథ్ అభిమానిని కాబట్టి భవిష్యత్తులో కచ్చితంగా చూడాలనిపిస్తే చూస్తాను అంటూ తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోగా విజయ్ దేవరకొండ సినిమాకి పడిన కష్టం తెరపై కనబడుతున్న గాని దర్శకుడిగా పూరి మరోసారి ఫెయిల్ అయ్యారని “లైగర్” చూసిన ప్రేక్షకులు అంటున్నారు. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పీడకలలా మిగిలిపోయింది. దీంతో “లైగర్” వచ్చే నెలలోనే డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల చేయనున్నట్టు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!