Virata Parvam: రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రమే `విరాటపర్వం`. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై మంచి హైప్ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. విరాటపర్వంలో రానా హీరోనే కాదు.. సాయిపల్లవి పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుందని టాక్ మొదలైంది. ఇందుకు కారణం చిత్ర టీమ్ బయటకు వదిలిన ఓ ప్రమోషన్ వీడియోనే. ఆ వీడియోలో ఓ యూట్యూబర్, రానాని వెతుక్కుంటూ సురేష్ ప్రొడక్షన్స్ కి వెళ్లాడు. తాను సాయి పల్లవి ఫ్యాన్ అని పరిచయం చేసుకుని, `మా సాయి పల్లవి ఎప్పుడొస్తుంది? ట్రైలర్ ఎప్పుడు? అసలు ఈసారైనా సినిమాను విడుదల చేస్తారా లేదా` అని ప్రశ్నలు సంధిస్తాడు.
అందుకు రానా `నేను కూడా సాయి పల్లవి ఫ్యాన్నే.. ఈ సినిమాని సాయి పల్లవి కోసమే తీశాం రా బాబూ` అని చెప్పడంతో.. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది. `విరాటపర్వం`ను సాయిపల్లవి సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంలో సాయి పల్లవిదే ప్రధాన పాత్ర అని, రానాది కాదనే ప్రచారాలు ఊపందుకున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, విరాటపర్వం థియేట్రికల్ ట్రైలర్ను రేపు కర్నూల్లో లాంచ్ చేయబోతున్నారు.
https://www.instagram.com/p/CeXtF2lDn8A/?utm_source=ig_web_copy_link