శ్రీశ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నాయి. అధిక ఆశ్వీయుజమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. సెప్టెంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు. వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి. భక్తులు టీవీలో లైవ్ ద్వారా వీటిని వీక్షించవచ్చు.