రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్లు…? భారత రాజ్యాంగం రాసిందెవరు..? రాజ్యాంగ సంక్షోభ సమయంలో గవర్నరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి..?? ఇది ఎవరు అవునన్నా..!, కాదన్నా…! ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరి అనుకూల సమాధానాలు వారు ఇచ్చుకుంటున్నారు. అంటే రాసిన వారు అంబెడ్కర్, 470 ఆర్టికల్లు అనే ఉంటుంది. కానీ అమలులోనే ఎవరి వరుస వాళ్ళది…! సింపుల్ గా చెప్పుకోవాలంటే జగన్ కి సాక్షి ఒక రాజ్యాంగం.., చంద్రబాబుకి ఆంధ్రజ్యోతి ఒక రాజ్యాంగం.., రాధాకృష్ణ ఒక రాజ్యాంగ రచయిత. ప్రతి వారం ఆయన రాసేవాణ్ణి చంద్రబాబుకి ఆర్టికల్లే. ఇలా చంద్రబాబు రాజ్యాంగ రచయితగా ఉన్న రాధాకృష్ణ పాపం రాజ్యాంగం అని, గవర్నర్ అని, హైకోర్టులు అని, పెద్ద పెద్ద వాళ్ళని తన రచనల్లోకి లాగేసారు. వాళ్ళు ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేసేసారు.
గవర్నర్ నిమ్మగడ్డకి సానుకూలమేనట…!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఆయనను గవర్నర్ ని కలిసి మళ్ళీ ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఉంది. ఈయన వెళ్లి కలిసాక ఆయన ఏం సమాధానం చెప్తారో..? ఎన్ని మెలికలు పెడతారో..? ఈ లోగా జగన్ ఎన్ని అస్త్రాలు వేస్తారో…? ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో..? అనేవి పక్కన పెట్టి అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి గవర్నర్ రమేష్ కుమార్ కి సానుకూలంగానే ఉండవచ్చు అంటూ రాశారు. తనకు కావాల్సింది, తాను అనుకున్నది అదే కాబట్టి అదే రాశారు. అయితే ఇక్కడ కొన్ని కీలక లాజిక్కులు, పాయింట్లు రాధాకృష్ణ రాస్తే బాగుండేది “రమేష్ కుమార్ పదవి కోల్పోవడంతో ఆర్డినెన్సు పై రాత్రికి రాత్రి సంతకం చేసింది గవర్నర్. ఈ అంశం సుప్రీం పూర్తి ఆదేశాలు ఇవ్వలేదా కాబట్టి.., గవర్నర్ అంగీకరిస్తారా…? నిమ్మగడ్డ విషయంలో చాలా ఆగ్రహంతో, ప్రతిష్టాత్మకంగా పోతున్న జగన్ సైలెంట్ గా ఉంటారా…? అనే సామాన్య ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా రాకుండా చేసేందుకు కొత్త ఎత్తులు కొన్ని సిద్ధమవుతున్నాయి.
ఆరోగ్య శ్రీలో లేని జబ్బు ఏది…!
జర్నలిజంలో ఒక కిక్కు ఉంటుంది. విమర్శ చేయాలి అనుకున్నప్పుడు ఆ కోణంలోనే విషయం కనిపిస్తుంది. పొగడాలి అనుకున్నప్పుడు ఆ కోణంలోనే కనిపిస్తుంది. ఒకే అంశాన్ని నలభై విధాలుగా తిప్పి తిప్పి రాయొచ్చు. అందులో రాధాకృష్ణ బాగా ఆరి తీరారు. ఆరోగ్య శ్రీ ని విమర్శించడం ఆయన ప్రధాన ఉద్దేశం. అందుకే ఆరోగ్యశ్రీలో చేర్చిన జబ్బుల సంఖ్యను పట్టుకున్నారు. ఆ పథకం ఉద్దేశం ఏంటి…? పేదోళ్లకు జబ్బులు వస్తే కార్పొరేట్ చికిత్స ఉచితంగా అందించడం..? అది జరుగుతుందా లేదా?? అనేది చూడాలి. అలాగే ఆరోగ్య స్త్రీలో ఫలానా జబ్బు లేదు, చేర్చవయ్యా జగనూ అంటూ విమర్శించాలి. అది లేకుండా జబ్బుల సంఖ్యను పట్టుకుంటే ఏం ఉపయోగం..! ఫలానా జబ్బు ఎక్కువగా ఉంది..! ఆరోగ్యశ్రీలో చేర్చు. పేదలు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆర్కే రాస్తే ప్రజా ప్రయోజనం కనిపించేది, కానీ అంకెలను విమర్శించడం వెనుక చంద్రబాబు భజన తప్ప ఇంకేం లేదు.
ఇక ప్రచార యావ లేని నేతలెవ్వరూ…??
ఇక “రూపాయి కూరకి పది రూపాయల మసాలా” అంటూ జగన్ ప్రచార యావపై రాధాకృష్ణ రాజ్యాంగంలో పలికారు. నిజానికి ప్రచార యావ లేని ముఖ్యమంత్రులు దేశంలో ఎవ్వరూ లేరు. దీనికి ఆద్యుడు మాత్రం నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబే.
నాడు సీఎం గా ఉన్నప్పుడు నవ నిర్మాణ దీక్ష, ధర్మపోరాట దీక్ష అంటూ వందల కోట్లు యాడ్లు ఇచ్చుకుని ప్రచార యావకి పాల్పడ్డారు. నేడు జగన్ దాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షికి నిండా యాడ్లూతో అభిషేకం చేస్తూ పోషిస్తున్నారు. నాడు చంద్రబాబులో రాధాకృష్ణకు కనిపించని ప్రచార యావ నేడు జగన్ లో కనిపించింది. అందుకే తన రాజ్యాంగంలో రాసుకొచ్చారు. ఒక్క మాటకొస్తే దేశంలో ప్రధాని సహా.., అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార యావతో రగిలిపోతున్నారు. ఆ యావ మీడియాకు కోట్లు తెచ్చిపెడుతుంది. అవి తనకు దక్కడం లేదని బాధని రాధాకృష్ణ తన రాజ్యాంగంలో అక్షకరీకరించారు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!