అవినీతికి తావులేదని.. అవినీతి జరిగితే ఏమి జరుగుతుందో అనేది అచ్చెన్నా అరెస్టుతో ఇప్పటికే సంకేతలు ఇచ్చిన వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకపక్క సీరియస్ గా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ విజన్ అర్ధం చేసుకోని కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు “అమ్యామ్యా” పనులకు పాల్పడుతున్నారన్న విషయ ఫలితం తాజాగా సీరియాస్ గా వెలుగులోకి వచ్చింది!
వివరాళ్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే విద్యుత్ సబ్ స్టేషన్లలో 12000 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు (కాంట్రాక్ట్) నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ పోస్టులు అంటే స్థానిక ఎమ్మెల్యేలు ఆగుతారా… త్వరలోనే ఆ పొస్టు పర్మినెంట్ అవుతుందని.. జీతం బాగుంటుందని.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని నమ్మబలికారట స్థానిక ఎమ్మెల్యేలు! దింతో నిరుద్యోగులు ఎమ్మెల్యేల ఇంటి ముందు క్యూలు కట్టారు
ప్రజాస్వామ్యంలో అన్నీ ఫ్రీగా చేసేస్తారేంటి… ఖర్చవుతుంది… ఒక్కో పోస్టును అక్షరాలా పదిలక్షల రూపాయలకు అమ్ముకున్నారంట! ఈ లిస్ట్ లో సుమారు 5వేల మంది నిరుద్యోగులూ ఉన్నారని… మొత్తంగా కలిపితే… 10లక్షల రూపాయాల చొప్పున 5000 మందినుంచి వస్తూలు చేసేటప్పటికి ఆ మొత్తం రు.200 కోట్లయినట్లు లెక్క!
ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఫలితంగా పోస్టుల భర్తీని నిలిపివేయాలని జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశించిన అనంతరం 10లక్షలు ఇచ్చినవారంతా వెళ్లి ఎమ్మెల్యే ఇంటివద్ద కూర్చున్నారు.
అయితే ఈ ఒత్తిడి భరించలేక.. సబ్ స్టేషన్లలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులను తొలగించి మరీ కొత్త వారికి పోస్టింగులు ఇచ్చేశారంట ప్రజాప్రతినిధులు. ఈ సాహసానికి వేదికైంది నెల్లూరు జిల్లా! దీంతో.. దాదాపు 15మంది ఆపరేటర్లను తొలగించి కొత్తవారిని పెట్టడంపై సీఐటీయూ ఉద్యోగులు ఆందోళన మొదలుపెట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ విషయం జగన్ వరకూ వెళ్తే… పరిస్థితి ఏమవుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది!