దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితులు ఎటు వైపు మళ్లుతున్నాయి..? కరోనా వ్యాప్తి పెరిగితే దేశం లో ఆకలి చావులు వస్తాయా …? కరోనా నేపథ్యంలో మన దేశం క్షేమమేనా…? క్షామం వైపు వెళ్తున్నామా..? మరో రెండు నెలలు ఇదే తీరున లాక్ డౌన్ కొనసాగితే కచ్చితంగా నిత్యావసరాలు, బియ్యం వంటివి అందుబాటులోకి రావు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఆ పరిస్థితులు ఏంటి? అనేది ఒకసారి చూద్దాం.
ఆహార నిల్వలకు కొదవ లేదు…!
ప్రస్తుతం చూసుకుంటే దేశంలో దాదాపు 7 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. అంటే దేశం మొత్తం జనాభాకు ఏడాది సరిపడా ఉన్నట్టే. ఈ లోగా వచ్చిన దిగుబడులు, ఈ ఏడాది పంటలు కలుపుకుంటే దేశంలో ఆహార నిల్వలకు ఇబ్బంది ఉండదు. కానీ…!
ఎదుట ఉన్న పండుని కొనుక్కుని తినాలంటే చేతిలో డబ్బులుండాలి. ఎదుట కనిపించే ఆహారాన్ని తెచ్చుకోవాలన్న చేతికి ఆదాయం రావాలి. అంటే ఆదాయం ఉంటేనే ఆహారం అందుతుంది. మన దేశంలో ప్రతి కుటుంబం సగటు ఆదాయంలో 60 శాతం ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే చెప్తుంది. అంటే దీని ప్రకారం ఆహారం తెచ్చుకోవాలన్నా, ఆకలిని తట్టుకోవాలన్నా చేతిలో ఆదాయం ఉండాలి.
ఆర్ధిక సంక్షోభమే కారణం…!
దేశంలో ఆహార సంక్షోభానికి అవకాశం లేదు. నిల్వలు బాగా ఎక్కువ ఉన్నాయి. కానీ ఆర్ధిక సంక్షోభం మాత్రం బాగా పెరుగుతుంది. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆదాయం లేక.. ఆ కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆహరం అందక ఇబ్బందులు తప్పకపోవచ్చు. దీనికి సరైన ఉదాహరణ… దేశంలో పేదల్లోనే ఎక్కువగా పోషకారా లోపాలు ఉంటాయి. అంటే ఆదాయం అనుసరించి, ఆహారం ఉంటుంది. దేశ వ్యాప్తంగా 40 శాతానికి పైగా పోషకాహార లోపం ఉండగా, వారిలో పేద వర్గాలే అధికం. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత బాగా డబ్బున్న వర్గం రెండు నెలలకు సరిపడా కొనుక్కుని ఇళ్లల్లో పెట్టుకున్నారు, కానీ పేదలువారానికి సరిపడా కొనుక్కున్నారు. తర్వాత వారానికి మళ్ళీవెతుక్కోవడమే.
పేరుకున్న లోపాలు… కారణాలు…!
దీనికి మరో కారణం ఆహార సరఫరా కూడా ఉంది. ప్రభుత్వం ఏమి పేద వర్గాలకు ఎటువంటి నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా ఆహారం రాయితీలో అందించదు. ఒక చోట పండిన పంట వేర్వేరు చోటకు వెళ్తుంది. తద్వారా సరఫరా పోతుంది.
అంటే … దేశంలో ఆకలికి ఆర్ధిక సంక్షోభం ఒక కారణంగా ఉండగా, సరఫరాలో లోపాలు మరో కారణంగా ఉంటున్నాయి. ఇవే కాకుండా ఉత్పత్తులు కొనుగోళ్లు… అంటే రైతు పండించిన పంటని కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి… మార్కెట్ లో అధిక ధరలకు అమ్మకానికి పెడుతున్నాయి. ఇదొక సమస్య. సో… చివరిగా దేశంలో ఆహారా నిల్వలు లేక, పంటలు పండక ఆకలి చావులు, క్షామం వచ్చే అవకాశం లేదు… కానీ.., ఆర్ధిక సంక్షోభం, సరఫరాలో లోపాలు, కొనుగోళ్లలో లోపాలు కారణంగా కొంత మేరకు క్షామం, ఆకలి చావులు వచ్చే ప్రమాదం మాత్రం ఉంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!