TDP Janasena: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా ఉంది. కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ – జనసేన పొత్తుకు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలి. వన్ సైడ్ లవ్ అయితే ఉపయోగం ఉండదు అన్నట్లు ఇరు వైపుల నుండి ఆసక్తి ఉంటే పొత్తు పెట్టుకోవాలి అన్నట్లు చెప్పారు చంద్రబాబు. దీంతో చాలా మందికి ఒక కన్ఫూషన్ నెలకొంది. టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా.. ఉండదా అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పొత్తు ఉంటుంది అనుకుంటున్న వాళ్లు అయ్యో పొత్తు ఉండదా అని బాధపడుతుండగా, పొత్తు ఉండదు అనుకునే వాళ్లు ఇది విని కాస్త రిలాక్స్ అయ్యారు.
టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఆ పార్టీల నిర్ణయం బట్టి ఉంటి. ఆ విషయాన్ని పక్కన బెడితే.. ఒక పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని ముందుగానే ప్రత్యర్ధికి తెలిసినట్లుగా చేయకూడదు. కానీ ఈ రెండు పార్టీల పొత్తు వ్యూహం ముందుగానే వైసీపీకి తెలిసిపోయింది. అలా తెలిసింది కాబట్టే వైసీపీ విరుగుడు వ్యూహం రచించింది. ఈ రెండు పార్టీలు కలిస్తే కాపు సామాజికవర్గ ఓట్లు కూటమికి చేరతాయి. అలా వెళ్లకుండా చేయడానికి ముందుగా వ్యూహాలను రచించింది వైసీపీ. అందులో మొదటిది వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకోవాలి. 2.ముద్రగడతో పార్టీ పెట్టించాలి. 3.గంటా శ్రీనివాసరావు, జెడి లక్ష్మీనారాయణ తదితరులతో ఈ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడించాలి. జనసేన – టీడీపీ పొత్తు పెట్టుకుందని ముందుగానే గ్రహించిన వైసీపీ ఈ విరుగుడు వ్యూహాలను రచించింది. సో.. ప్రత్యర్ధి పార్టీకి ఆ అవకాశం ఇవ్వకూడదు అంటే.. పొత్తు ఉంటుందా.. ఉండదా అనేది చివరి వరకూ క్లారిటీ ఇవ్వకూడదు. కార్యకర్త అడిగిన వెంటనే పొత్తు ఉంటుంది అని చెప్పగలరా.. అలా చెప్పకూడదు. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎన్నికలు రావడానికి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పుడు పొత్తుల విషయం ఫైనల్ చేస్తే వీళ్లకు అదనపు బలం రాదు. అందుకే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు వరకూ అధికారికంగా పొత్తు విషయాలపై బహిరంగంగా చెప్పరు. ఇప్పుడే పొత్తు విషయాలను ఖరారు చేస్తే ప్రత్యర్ధి పార్టీ వాళ్లను దెబ్బతీయడానికి వ్యూహాలను రచిస్తుంది.
రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారు అనేది ముందు రోజు వరకూ చెప్పరు. అలానే పొత్తు విషయాలను ముందుగానే బహిర్గతం చేయరు. ఉదహారణకు తీసుకుంటే పార్టీలు మారే ఎమ్మెల్యేలు.. ముందు రోజు వరకూ నేను పార్టీ మారను అని చెబుతూనే ఉంటారు. జగన్మోహనరెడ్డి నాకు దేవుడు, నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు అని చెబుతారు. అదే విధంగా చంద్రబాబే మా నాయకుడు, నేను పార్టీ మారను అని చెబుతారు. అన్ని మాటలు చెప్పిన వాళ్లు మరుసటి రోజే పార్టీ మారిపోతుంటారు. రాజకీయాలు అంటే అలానే చేస్తుంటారు. జనసేన – టీడీపీ పొత్తుల గురించి ఆ రెండు పార్టీలు ఇప్పుడు మాట్లాడకుండా ఉండటమే మంచింది. అది రాజకీయంగా ఒక స్ట్రాటజీ.