Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో సినిమాలో కేశవ పాత్రలో నటిస్తున్న నటుడు జగదీష్ అరెస్టు కావటం తెలిసిందే. ఓ అమ్మాయికి సంబంధించి ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడటంతో.. ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేసు నమోదు అయ్యి జగదీష్ నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో “పుష్ప 2” షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దర్శకుడు సుకుమార్.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు జగదీష్ ను బెయిల్ తో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.
ఇందుకోసం ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బెయిల్ పై రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. “పుష్ప” మొదటి భాగంలో కేశవ పాత్ర చాలా హైలెట్ అయింది. అల్లు అర్జున్ పక్కనే సినిమాలో సగభాగం ఉండే పాత్ర. దీంతో రెండో భాగంలో కేశవ పాత్రకి సంబంధించి అసలు షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదట. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో.. జగదీష్ వాళ్ళ అనుకున్న సమయం కంటే లేట్ అయ్యే పరిస్థితి ఉండటంతో బెయిల్ పై అతనిని తీసుకురావడానికి.. నిర్మాతలు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. “పుష్ప” మొదటి భాగం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించడం జరిగింది.
ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా అందుకోవడం జరిగింది. దీంతో “పుష్ప” రెండో భాగం సినిమాని మొదటి పార్ట్ కంటే చాలా ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ఇండియాలో ఏ సినిమా రిలీజ్ కానీ ఎక్కువ భాషలలో… విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో విడుదల తేదీ ప్రకటించడంతో సినిమాలో కేశవ పాత్ర ప్రధానం కావడంతో జగదీష్ నీ వీలైనంత త్వరగా బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి “పుష్ప” నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.