Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతోంది. మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాత ఎస్ రాధాకృష్ణ.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. “గుంటూరు కారం” విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లమెల్లగా జరుగుతున్నాయి. వారం క్రితం “దమ్ మసాలా బిర్యాని”.. అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
మొదటి సింగిల్ సాంగ్ దమ్ మసాలా.. సాంగ్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ సెకండ్ సాంగ్ ప్రోమో అప్ డేట్ ఇవ్వటం జరిగింది. “ఓ మై బేబీ”.. టైటిల్ పేరిట విడుదలైన ఈ సెకండ్ సాంగ్..లో “అమ్ము రమణ గాడు.. గుర్తుపెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది… ఓ మై బేబీ” అంటూ ప్రోమో సాంగ్ విడుదల అయింది. సాంగ్ బట్టి చూస్తే రొమాంటిక్ మెలోడీ అని అర్థమవుతుంది. ఈ సాంగ్ ను శిల్పారావు పాడగా రామ జోగయ్య శాస్త్రి… లిరిక్స్ అందించారు. ఈ క్రమంలో ఫుల్ సాంగ్ వర్షన్ డిసెంబర్ 13వ తారీకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. విడుదలైన ఈ సాంగ్ వీడియోలో శ్రీలీల ఉంది. బ్లాక్ కలర్ చీరలో.. చాలా అందంగా కనిపిస్తుంది.
2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ “ఖలేజా” అనే సినిమా చేశారు. అంతకుముందు “అతడు” అనే సినిమా చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో పెద్దగా మెప్పించకపోయినా గానీ మహేష్ నటన పరంగా అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాయి. రెండు సినిమాలలో చాలా వైవిధ్యంగా మహేష్ బాబుని త్రివిక్రమ్ చూపించాడు. “అతడు”లో సైలెంట్ … “ఖలేజా”లో కామెడీ చేసే రీతిలో చూపించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మహేష్ బాబులో కొత్త నటన కోణాన్ని.. చాలా వరకు త్రివిక్రమ్ వెలికితీయడం జరిగింది. కాగా మళ్లీ పుష్కరకాలం తర్వాత.. గుంటూరు యాసలో మహేష్ బాబు డైలాగులు చెప్పటం.. ఫుల్ మాస్ పాత్ర ఈ సినిమాలో చేయటంతో… ఫ్యాన్స్ “గుంటూరు కారం” పై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.