Naga Chaitanya Samantha: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమంత నాగచైతన్య జంట ఒకప్పుడు చూడముచ్చటగా ఉండేది. నాగచైతన్య కెరియర్ లో సమంత ఓ లక్కీ హీరోయిన్ అని చెప్పవచ్చు. ఏం మాయ చేసావే అనే సినిమాతో నాగచైతన్య మొదటి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఫ్లాపుల్లో ఉన్న సమయంలో సమంత నాగచైతన్య పక్కన నటించగా అనేక సినిమాలు విజయాలు సాధించాయి. కానీ ఉన్నట్టుండి 2021లో వీరిద్దరూ సడన్ గా విడాకులు ప్రకటించడం ఇండస్ట్రీలో ఉన్న వారికి మాత్రమే కాదు సామాన్యులకు షాక్ ఇచ్చినట్లు పరిస్థితి మారింది.
ఇదిలా ఉంటే మరోసారి వీళ్ళిద్దరూ కలవాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. గత ఏడాది సమంత మయోసైటీస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడిన సమయంలో కూడా సోషల్ మీడియాలో.. వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందనే చర్చ జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల రెండో పెళ్లి గురించి సమంత కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దేశంలో రెండో పెళ్లి మూడో పెళ్లిళ్లకే ఎక్కువ విడాకుల రేటు ఉందని గణాంకాలు తెలియజేస్తూ తన ఫోకస్ అంత సినిమాలు ఆరోగ్యం పైన ఉన్నట్టు తెలిపింది. ఇప్పుడు అదే విధంగా ఇటీవల నాగచైతన్యకి కూడా రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైందంట.
“దూత” వెబ్ సిరీస్ విజయం సాధించడంతో.. సక్సెస్ సంబరంలో పాల్గొన్న సమయంలో ఈ ప్రశ్న ఏదైనా తనకు అలాంటి ఉద్దేశం లేదని చైతన్య స్పష్టం చేశారు. అంతేకాదు తన ఫోకస్ మొత్తం అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఉందని సినిమాలు తప్ప వేరే ఆలోచన లేదని రెండో పెళ్లి వార్తలపై సమంత మాదిరిగానే జవాబు ఇవ్వటం జరిగింది. నాగచైతన్య ప్రస్తుతం తండెల్ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని దర్శకుడు చందు మొండేటి తీస్తున్నారు. సముద్రపు జాలరి పాత్రలో మాస్ తరహా లో చైతన్య నటిస్తున్నాడు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!