Raadhika Sarathkumar: 80వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో రాధిక శరత్ కుమార్ ఒకరు. నటుడు ఎమ్.ఆర్ రాధ మరియు గీత దంపతులకు 1962 లో జన్మించిన రాధిక.. 1978లో కిజక్కే పోగుమ్ రైల్ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. తెలుగులో రాధిక చేసిన తొలి చిత్రం చిలిపి వయసు. 1980లో ఈ చిత్రం విడుదలైంది
ఆపై యువతరం కదిలింది, కిరాయి రౌడీలు, న్యాయం కావాలి, ప్రియా, రాధా కళ్యాణం, ఇది పెళ్ళంటారా, ఈనాడు తో సహా ఎన్నో చిత్రాలు చేశారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో తెర పంచుకున్నారు. హీరోయిన్ గా గ్రాఫ్ తగ్గిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రాధిక.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సినిమాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ నే మరోవైపు బుల్లితెరపై సీరియల్స్ చేశారు. అలాగే రాడాన్ పిక్చర్స్ అనే సమస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమవుతున్న పలు తమిళ్, తెలుగు సీరియల్స్ ను నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పుడు రాజకీయాల్లో సైతం సత్తా చాటేందుకు రాధిక రంగంలోకి దిగుతున్నారు. 2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాధిక మరియు ఆమె శరత్కుమార్ అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అదే ఏడాది ఆమెను పార్టీ నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. ఇక 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో రాధిక విరుదునగర్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ఆస్తులు, అప్పుల వివరాలను అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. విరుదునగర్ నుంచి బరిలోకి దిగుతున్న నటి రాధిక కూడా తాజాగా తన ఆస్తులు మరియు అప్పుల చిట్టా బయటపెట్టారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆమె.. ఆస్తుల వివరాలను వెల్లడించారు.
రాధిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మొత్తం ఆస్తుల విలువ అక్షరాల రూ. 53.45 కోట్లు. అందులో రూ.33.01లక్షలు విలువ చేసే నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులు కాగా.. రూ. 26.40 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే రాధికకు అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. తనకు రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నట్లు రాధిక నామినేషన్ లో స్వయంగా పేర్కొంది. కాగా, రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి రాధిక భర్త, ప్రముఖ నటుడు శరత్ కుమార్ తన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని ఇటీవల బీజేపీలో విలీనం చేశారు. ఆ కారణంగానే రాధికకు విరుదునగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ సీటును కేటాయించింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!