పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో `ఆదిపురుష్` ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు.
అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్దత్త నాగే నటిస్తున్నారు. టి. సిరీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటోంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ దిమ్మతిరిగే రేటు పలికాయట. ఈ సినిమా తెలుగు రైట్స్ యూవీ క్రియేషన్స్ వారు దక్కించుకున్నట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అందుకుగానూ సదరు సంస్థ ఏకంగా రూ. 100 కోట్లు చల్లించినట్లు కూడా టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!