Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంక ఒక్క వారం ఆట మాత్రం మిగిలి ఉంది. ఈసారి సీజన్ లో టైటిల్ కోసం మొత్తం 19 మంది సభ్యులు పోటీపడ్డారు. ప్రారంభంలో 14 మంది నాలుగు వారాలు గడిచిన తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. 14 వారాలు ఆట ముగిసిన తర్వాత ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మిగిలి ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో శోభ ఎలిమినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ లో ఆస్కార్ అవార్డు విన్నర్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ స్టేజ్ పై.. పాటతోనే థాంక్స్ చెప్పారు అది చాలా కొత్తగా ఉందని నాగ్ అన్నారు. అది రాజమౌళి ఐడియా అని కీరవాణి అన్నారు. ఆ తర్వాత టాప్ సెవెన్ హౌస్ మేట్స్ నీ నాగార్జున పరిచయం చేయడం జరిగింది.
అనంతరం తన కొత్త సినిమా “నా సామి రంగా”కి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే సమయంలో కీరవాణితో ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ ప్రకటనలో భాగంగా.. ప్రశాంత్ పేరు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మిమ్మల్ని రైతుబిడ్డ అని పిలుస్తున్నారు. అవును సార్ అని ప్రశాంత్ బదులు ఇవ్వడం జరిగింది. దీంతో మీరు నేలను ఎక్కువగా తాకుతున్నారు కదా కనుక..”భూమి బిడ్డ” ప్రశాంత్ అంటూ పిలిపించుకోండి. అప్పుడు బీబీ అని ముందు షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. భూమి బిడ్డ, బిగ్ బాస్ రెండిటికి ఉపయోగపడుతుందని కీరవాణి సలహా ఇచ్చారు.
ఇదంతా పక్కన పెడితే ఫైనలిస్ట్ ప్రకటన ప్రక్రియలో భాగంగా రైతుబిడ్డ ప్రశాంత్ ఫైనలిస్ట్ బ్యానర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారితో ఓపెనింగ్ చేయటం సంచలనం సృష్టించింది. ప్రశాంత్ గెలుస్తాడు కాబట్టే బిగ్ బాస్ నిర్వాహకులు అలా చేసి ఉండొచ్చు అని ఆడియన్స్ అంటున్నారు. సీజన్ సెవెన్ లో అత్యధికంగా ఓటింగ్ రాబడుతున్న కంటెస్టెంట్ ప్రశాంతే. కామన్ మ్యాన్ కావటంతో పాటు సెలబ్రిటీలు ఎక్కువగా హౌస్లో అతని టార్గెట్ చేయడంతో బయట బాగా సింపతి పెరిగింది. ఇదే సమయంలో చాలా తెలివైన గేమ్ ఆడుతున్నాడు. దీంతో కచ్చితంగా ప్రశాంత్ టైటిల్ గెలిచే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.