Pallavi Prasanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తుల పై దాడులు ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్.. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలో తీర్పును రేపటికి వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు అరెస్ట్ అయిన ప్రశాంత్ కి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో విచారణ జరగగా తీర్పు రేపటికి వాయిదా వేయడం జరిగింది. దీంతో అతడు ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మరోపక్క ప్రశాంత్ నీ విడిపించడానికి భోలె.. తనవంతుగా హైకోర్టు లాయర్లతో ప్రయత్నాలు చేయడం జరిగింది. టైటిల్ సాధించి ఆ ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉండటం వెంటనే జైలుకెళ్లడంతో ప్రశాంత్ విషయంలో భోలే ఎమోషనల్ అయ్యారు. ఎవరు ఉహించని విధంగా అనుకోని సంఘటనలు ఇలా జరుగుతాయి. ప్రతి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఆతరహాలోనే ఈ దురదృష్టం వాటిల్లింది.. అని బోలె కన్నీరు పెట్టుకున్నారు. మరోపక్క ప్రశాంత్ జైలు పాలు కావడంతో.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. డిసెంబర్ 17వ తారీకు గ్రాండ్ ఫినాలే టైటిల్ ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు తమ వాహనాలతో బయటకు వస్తుండగా.. బయట అల్లరి మూకలు… దాడులు చేయడం జరిగింది. చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కారులు ధ్వంసం అయ్యాయి. కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగింది. ఆర్టీసీ బస్సుల అద్దాలు అదేవిధంగా పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పలు సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా చేర్చి.. కేసు నమోదు చేశారు. బుధవారం ప్రశాంత్ నీ అతనీ ఇంటి వద్ద పోలీసుల అదుపులోకి తీసుకుని.. అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడం జరిగింది. ఈ క్రమంలో 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో.. ఉన్నారు.