Bigg Boss Telugu season 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ వారం ఆట సాగుతోంది. ఈసారి టైటిల్ ఎవరికి గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. హౌస్ లో అమర్, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ ఉన్నారు. వీరిలో ఎవరు విజేత అవుతారో.. అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బయట భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. చివరి వారం కావడంతో… ఎవరికి వారు తమ అభిమాన కంటెస్టెంట్ ని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్…అమర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. టికెట్టు ఫినాలే టాస్క్ లో భాగంగా… ప్రియాంక దగ్గర బాల్ లాక్కునే ప్రయత్నంలో ఆమెను నేలకేసి కొట్టే విధంగా అతడు ఆడిన ఆట తీరు… చాలా క్రూరంగా ఉంది.
లైవ్ లో చూడలేకపోయాం… ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా షో చూస్తుంటారు. ఆ టాస్క్ అయిపోయాక ప్రియాంక ఏడ్చింది. ఆ సన్నివేశం చూసిన సమయంలో నేను చాలా కంగారు పడ్డాను. “జానకి కలగనలేదు” సీరియల్ లో వీరిద్దరూ భార్యాభర్తలు గా నటించారు. ఆ సీరియల్ ముగింపు పలకగానే ఈ షోలో రాణించడం జరిగింది. వీరి మధ్య పెద్ద పెద్ద మనస్పర్ధలు కూడా ఏమీ లేవు. ఒకరిని మరొకరు గౌరవించుకునే వ్యక్తులు. ఈ సీజన్ మొత్తంలో ఒకే ఒక్కసారి అమర్ నీ ప్రియాంక నామినేట్ చేయడం జరిగింది. కానీ ఆ బాల్ టాస్క్ లో ప్రియాంకాని ఆ రీతిగా గాల్లోకి ఎత్తేసి కింద పడేయటం చాలా బాధ అనిపించింది అని ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్ స్పష్టం చేశారు. ఇంక రెండు రోజులు మాత్రమే ఓటింగ్ కి సమయం మిగిలి ఉంది. దీంతో కంటెస్టెంట్స్ యొక్క బయట పిఆర్ టీమ్స్.. తమ సభ్యులను గెలిపించుకోవడానికి.. రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి.
ప్రస్తుతం బయట వినబడుతున్న టాక్ ప్రకారం… పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్… ఈ నలుగురిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఓటింగ్ పరంగా సీజన్ సెవెన్ లో అత్యధికంగా మొదటి నుండి రైతుబిడ్డ ప్రశాంత్ కి ఎక్కువ ఓటింగ్ నమోదు కావడం జరిగింది. పైగా హౌస్ లో చాలామంది సెలబ్రిటీలు.. ప్రశాంత్ నీ తక్కువ చేసి చూడటంతో పాటు కొన్ని మాటలు వదలడంతో అతనిపై బయట బాగా సింపతీ పెరిగింది. దీంతో కచ్చితంగా సీజన్ సెవెన్ టైటిల్ ప్రశాంత్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.