Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇంకా వారం రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసిందని చెప్పవచ్చు. గత సీజన్స్ లలో హౌస్ లో ఏం జరుగుతుంది అనేది ముందుగానే పసిగట్టే పరిస్థితి ఉండేది. కానీ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అన్న విధంగానే హౌస్ లో ఉన్న సభ్యుల వ్యూహాలు.. చూస్తున్న ప్రేక్షకుల ఆడియన్స్ అంచనాలు తలకిందులు చేస్తూ షో ని చాలా అద్భుతంగా నడిపించారు. రతిక ఎలిమినేట్ కావటం మళ్లీ హౌస్ లోకి రియంట్రీ ఇవ్వడం.. అందరికీ షాక్ ఇవ్వటం జరిగింది.
అంతేకాదు ఈసారి సీజన్ సెవెన్ లో ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు వారాలు గడిచిన తర్వాత వీళ్లు ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. వైల్డ్ కార్డు సభ్యులలో బోలె హౌస్ లో ఉన్నంతకాలం చాలా ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ప్రతి సీజన్ లో ఫైనల్ వారంలో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉండేవారు. కానీ సీజన్ సెవెన్ లో ఫైనలిస్ట్ సభ్యులు మొత్తం ఆరుగురు. వాళ్ళు ఎవరంటే.. అర్జున్, అమర్, శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, యావర్. ఈ ఆరుగురు ప్రస్తుతం ఫైనల్ వీక్ లో కంటెస్టెంట్స్. వీరిలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్లే సీజన్ సెవెన్ విన్నర్.
దీంతో ఈసారి సీజన్ సెవెన్ టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. సీజన్ సెవెన్ ప్రారంభం నుండి శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ కచ్చితంగా వీళ్ళు ఫైనల్ వారంలో ఉంటారని అంచనా వేశారు. ఆ రకంగానే ఆ నలుగురు ఇప్పుడు ఫైనల్ వారానికి చేరుకున్నారు. ఆ నలుగురితోపాటు అర్జున్ మరియు ప్రియాంక కూడా పోటీ పడుతూ ఉండటం విశేషం. సీజన్ సెవెన్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మొదటి నుండి రైతు బిడ్డ ప్రశాంత్ కి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత శివాజీ, అమర్, యావర్ లకు భారీగా ఓట్లు పడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.