Brahmamudi March 28 2024 Episode 369: రాజ్ బాబు ఏడుస్తుండడంతో కావ్య మీ ఆకలి తీర్తే సరిపోదు వాడి అవసరం కూడా చూడాలి అని అంటుంది. వాడికి ఏం పెడితే ఏడవకుండా ఉంటాడో నాకు తెలియట్లేదు అని అంటాడు రాజ్ బిడ్డ నీకు అనగానే సరిపోదు అన్ని తెలుసుకోవాలి అని అంటుంది కావ్య ఇక మీరు వాడిని సముదాయిస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని వాడి ఉగ్గు తీసుకురావడానికి బయటకి వెళ్దాం అనుకుంటుంది అప్పుడే కళ్యాణ్ అడ్డుపడి నేను తీసుకొస్తాను వదిన అని అంటాడు ఇక కళ్యాణ్ వద్దని చెప్పినా తనే వెళ్లి తీసుకువస్తాడు ఇదంతా అనామిక గమనించి కళ్యాణ్ కావ్య ఇద్దరు లోపలికి వచ్చేసరికి ఇంట్లో అందరిని పిలిచి పంచాయతీ పెడుతుంది.
అందరూ కావ్య కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే ఇక అపర్ణ దేవి అందుకుంటుంది మొదట అనామిక మొదలు పెడితే ఆ తర్వాత అపర్ణాదేవి కళ్యాణి తిడుతుంది ఇక చూసావా కళ్యాణ్ అందరూ నిన్నే తప్పంటున్నారు అని ధాన్యం మొదలు పెడుతుంది ఇక అందరికీ సమానంగా కావ్య ఇక మీదట నేను ఎప్పుడు కళ్యాణ్ కి ఏ పని చెప్పను అని ఆ ఉగ్గు తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇకనామికకు ధాన్యానికి ఇద్దరికీ కలిపి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కళ్యాణ్. బాబుకి ఉగ్గు తినిపించి నిద్ర పుచ్చుతుంది కావ్య. వాడి ఎంతసేపటికి నిద్రపోకపోతే ఉయ్యాల వేసి ఊపుతుంది రాజ్ కొంత టైం తర్వాత నిద్ర లేచి చూసి కావ్య ఇంకా బాబుకి సేవ చేయడం చూసి థాంక్స్ అనిచెప్తాడు.
ఇక కావ్య, దేనికి అని అడుగుతుంది. కష్టపడినా ఇష్టపడుతున్నందుకు, అని అంటాడు మీరు థాంక్స్ చెప్పినా సంతోషపడే రోజులు పోయాయి అని అంటుంది కావ్య. నేను అడిగితే మీరు చెప్పలేరు మీరు చెప్పేది నాకు అక్కర్లేదు అని కావ్య అంటుంది. ఇక ఉదయం అందరూ హాల్లో ఉండగా డెలివరీ బాయ్ వచ్చి మేడం డెలివరీ అని పెద్దగా అరుస్తాడు ఈ డెలివరీ నా ఇక్కడ ఆల్రెడీ డెలివరీ అయిపోయి ఒక బాబు కూడా పుట్టుకొచ్చాడు అని రుద్రాణి వెటకారంగా అంటుంది. ఈ పార్సిల్ ఆర్డర్ పెట్టారు మేడం అని అంటే రాహుల్ వెళ్ళి పార్సిల్ తీసుకొని వస్తాడు. అ పార్సల్ ఏంటి అని అడిగితే ఉయ్యాల అని చెప్తాడు డెలివరీ బాయ్. రాహుల్ పార్సిల్ తీసుకొని లోపలికి వస్తాడు. మమ్మీ ఇదేదో ఉయ్యాలా ఉంది మమ్మీ అని అంటాడు రాహుల్. ఇక అందరూ ఆ పార్సెల్ వైపే చూస్తూ ఉంటారు ఇక రుద్రాణి అందుకుంటుంది.
ఇక వెంటనే అపర్ణ వైపు చూస్తూ రుద్రాణి వదిన ఈ ఉయ్యాల నువ్వే ఆర్డర్ పెట్టావు కదా అని అంటుంది.అవును నిన్ను పడుకోబెట్టి ఊపుదామని అంటుంది అపర్ణ. పైకి టెంకాయల స్ట్రాంగ్ కనిపిస్తావు కానీ లోపల నీ మనసు కొబ్బరిని ఎలా తీయగా ఉంటాయి వదినా, మేమందరం ఏదో అనుకుంటామని నీ మాతృ ప్రేమని నానమ్మ ప్రేమని ఎందుకు దాచుకుంటావు దొంగ అని అంటుంది రుద్రాణి. ఈ ఉయ్యాల ఆర్డర్ పెట్టింది నువ్వే నీ మనబడి కోసమే కదా అని అంటుంది. షటప్ రుద్రాణి నేను నా కొడుకుని పక్కన పెట్టాను ఇక వాడి కొడుకు నేనెలా ఉయ్యాలో పడుకోబెడతాను. అవునా మరి ఉయ్యాల ఆర్డర్ పెట్టింది ఎవరు అని రుద్రాణి అంటూ ఉండగా అక్కడికి వచ్చిన రాజ్ నేనే ఆర్డర్ పెట్టాను అని అంటాడు. అక్కడే అపర్ణా వాళ్ళ ముందు కూర్చుని ఆ పార్సెల్ తీసి ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఓహో ఉయ్యాలో వేసి ఘనంగా బారసాల జరిపిస్తాడేమో అని రుద్రాణి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. బారసాలకి ఏం పేరు పెడతారు మా నాన్న పేరు దుగ్గిరాల సీతారామయ్య అని, అదే పెడతారేమో అని అంటుంది రుద్రాణి. గిలక్కాయలు ఏనుగు బొమ్మలు మర్చిపోయాను అట్లాంటి బొమ్మలు అన్ని ఆర్డర్ పెట్టలేకపోయావా అని అంటుంది రుద్రాణి. ఏంటి అంతా నాకేసి మింగేసి ఎలా చూస్తున్నారు. అప్పుడే ఏమైంది ఇంకా ఎన్ని వేడుకలు జరిపించబోతున్నాడు మా రాజ్ అని అంటుంది రుద్రాణి. నీకు పండగే వదిన మనవడు బోర్లా పడితే బొబ్బట్లు. పాకినందుకు పాయసం కూర్చోవడం మొదలుపెడితే కాజాలు, నవ్వడం మొదలు పెడితే నువ్వులు ఉండలు, ఊ కొడితే ఉడ్ గిన్నెలు అడుగులకు అరిసెలు ఎన్ని పంచి పెట్టాలి. భోగి రోజు భోగిపల్లి కూడా పోయాలి సుమా, అని అంటుంది రుద్రాణి. ఇంకొక మాట మాట్లాడితే నేను నీకు తలంటి కోస్తా ఆరేటప్పటికి ఆరు నెలలు పడుతుంది అని కౌంటర్ ఇస్తుంది ఇందిరా దేవి రుద్రానికి, ఇంకా అనింది చాలు నోరు మూసుకో అని అంటుంది. మరోవైపు రాజ్ ఉయ్యాల ఓపెన్ చేసి అంది సరిచేసి బాబు ని పడుకోబెడతాడు. అప్పుడే ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తుంటే రుద్రాణి వాడి తల్లేమో కొడుకు యోగక్షేమాలు కనుక్కోవడానికి ఫోన్ చేసినట్టు ఉంది అని అంటుంది. రాజ్ సీరియస్ గా రుద్రాణి వైపు చూసి వెళ్ళిపోతాడు. బాబు ఏడుస్తూ ఉంటాడు ఉయ్యాలో అపర్ణాదేవితో సహా అందరూ చూస్తూ నిలబడతారు కావ్య ఎత్తుకోవడానికి వెళ్లబోతుంటే అపర్ణాదేవి ఒక చూపుతో కావ్య ఆగిపోతుంది. బాబు అలానే ఏడుస్తూ ఉంటాడు.
ఇక స్వప్న ఎంట్రీ ఇస్తూనే బాబుని ఎత్తుకుంటుంది. ఇంతమంది ఉన్నారు ఒక చిన్నారి ఏడుస్తుంటే ఎత్తుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు కాలంలో మేకులు గాని గుచ్చుకున్నాయా ఏంటి మీకు అని అంటుంది. అసలు ఇంతమంది ఇక్కడున్న ఎవరికి మానవత్వం లేదు అంటూ అరుస్తుంది. అసలు ఆ బిడ్డ ఎవరి బిడ్డ తెలిస్తే నువ్విలా మాట్లాడవు అని అంటుంది రుద్రాణి. అవును ఇంతకీ ఈ బిడ్డ ఎవరు అని అడుగుతుంది స్వప్న. ఈ బిడ్డ తల్లి ఎవరు అని అడుగుతుంది తల్లి ఎవరో తెలీదు అది ఆ భగవంతుడికే తెలియాలి కానీ ఈ చిన్నారి మాత్రం రాజ్ కొడుకు అని అంటుంది రుద్రాణి. ఇలాంటి పనులు రాహుల్ చేశాడంటే నమ్ముతాను కానీ రాజు చేశాడంటే నేనెలా నమ్ముతాను అని అంటుంది స్వప్న. నువ్వు నమ్మినా నమ్మక పోయినా అదే నిజం అని అంటుంది రుద్రాణి. ఇంతమంది మధ్యలో రాజు పై నిందలు వేస్తుంటే అందరూ సైలెంట్ గా ఉంటారేంటి రాజు ఎలాంటి వాడో మీ అందరికీ తెలియదా అలాంటి జెంటిల్మెన్ ఇలాంటి తప్పు చేశాడు అంటే నేను నమ్మను అని అంటుంది. పాపం ఇంట్లో వాళ్ళందరికీ గొంతులో వెలక్కాయపడిందిలే అందుకే మాట్లాడలేకపోతున్నారు నీ చెల్లెల్ని అడుగు, ఆ బిడ్డ ఎవరి బిడ్డ బాగా చెప్తుంది అని అంటూ ఉంటే, స్వప్న మాత్రం ఈ బిడ్డ రాజు బిడ్డ కాదు నాకు నమ్మాలని లేదు అని అంటూ ఉంటే అక్కడికి వచ్చిన రాజ్ అవును నా బిడ్డ అని గట్టిగా అరిచి ఆ బిడ్డను తీసుకొని పైకి వెళ్ళిపోతాడు ఇప్పుడు అర్థమైందా అని అంటుంది రుద్రాణి. ఇంకా క్లారిటీగా కావాలంటే నీ చెల్లెలిని అడుగు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక స్వప్న కావ్య ని తీసుకొని రూమ్ లోకి వెళుతుంది నిజం చెప్పు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని అడుగుతుంది. కావ్య మాత్రం నిజం చెప్పకుండా నీ ప్రయాణం ఎలా సాగింది అక్క నువ్వు రెస్ట్ తీసుకో నేను ఆయనకి టిఫిన్ చేసి వస్తాను అని అంటే చేయి టిఫిన్ చేయి ఏం చేస్తున్నావు పూరి చేస్తున్నావా ఇడ్లీ చేస్తున్నావా? నీ భర్తకి బలంగా ఉండడానికి బాదంపప్పు జీడిపప్పు వేసి పెట్టక పోయావా నువ్వు ఈ ఈ విధంగా చేస్తూ ఉంటే నీ మౌనాన్ని వాళ్లు ఆసరాగా చేసుకుంటారు అయినా రాజు బిడ్డతో ఇంటికి వస్తే మౌనంగా చూస్తూ ఉన్నావా? మరి ఏం చేయమంటావ్ అక్క ఇప్పుడు అడిగినంత మాత్రాన నిజం చెప్పట్లేదు అని అంటుంది. నువ్వు అలా సైలెంట్ గా ఉంటే ఎలాగు నేను ఉండగా మరి ఆడదాన్ని ఎలా సంబంధం పెట్టుకున్నామని కాలర్ పట్టుకుని నిలదీయాలి అని అంటుంది స్వప్న ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు అని అంటుంది కావ్య స్వప్న ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది అసలు మనం ఇప్పుడు ఒక చోటికి వెళ్లాలి కదా అని అంటుంది. ఎక్కడికి అని అంటే రాజ్ పై కేసు పెట్టడానికి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని అంటుంది అవును భార్య ఉండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకొని బిడ్డని కలవడం ఈ నేరానికి రాజ్ పై కంప్లైంట్ ఇద్దాం అని అంటుంది స్వప్న అలా చేస్తే నీ ఇంటి పరువు తీసిన వాళ్ళం అవుతాము అని అంటుంది కావ్య. నీకు ఇంత జరిగినా ఇంకా ఇల్లు ఇంట్లో వాళ్ళు అనే ఊరుకుంటే ఎలాగో అని అంటుంది స్వప్న. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్లి ఆయన్ని జైల్లో పెడతారు అప్పుడు ఆయన నాకు దూరంగా ఉంటాడు. ఇప్పుడు జరుగు ఇంట్లో జరుగుతుంది కూడా అదే అక్క. ఇంట్లో వాళ్ళు ఎవరు ఆయనతో మాట్లాడట్లేదు అందరూ కలిసి ఆయన్ని వెలివేశారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒకటే అని అంటుంది. కనీసం తప్పు చేస్తే శిక్ష అయిన అనుభవించానని రాజ్ కి తెలియాలి కదా అని అంటుంది స్వప్న. రాజుని ఇలానే వదిలేస్తావా అని కావ్య నీ కోప్పడుతూ ఉంటుంది స్వప్న తాను చేసిన తప్పుకు రాజ సమాధానం చెప్పే వరకు నేను అతని వదిలిపెట్టను అని కావ్య స్వప్నకి మాటిస్తుంది కావాలంటే నువ్వు నాకు సహాయం చెయ్ అక్క అంతేకానీ ఇంట్లో గొడవ మాత్రం చేయొద్దు అని అంటుంది నేను మాత్రం నీకు సహాయం చేస్తాను కానీ అది కొద్ది రోజులే కొన్ని రోజుల తర్వాత రాజ్ నిజం చెప్పకపోతే మాత్రం నేను ఇక్కడ గొడవ చేస్తాను ఇంట్లో వాళ్ళందరిని రోడ్డు తీరుస్తాను నీకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను అని కావ్య కి సపోర్ట్ గా నిలుస్తుంది స్వప్న..
ఇక మరోవైపు కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తాడు అప్పు ఎలా ఉన్నావని అడుగుతాడు ఎలా ఉంటాం మీ అన్నయ్య చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా లేరు మా అమ్మాయి అయితే అన్నం కూడా తినట్లేదు అని అంటుంది అప్పు. ఇక్కడ మా అన్నయ్యని అడుగుదామంటే వదిన అన్నిటికి నేనున్నాను కదా చూసుకుంటాను నువ్వేం మాట్లాడొద్దు అని అంటుంది. తను ఎందుకు మౌనంగా ఉంటుందో దేనికోసం ఎదురు చూస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు కళ్యాణ్. ఇలాంటి పరిస్థితుల్లో మా అక్కకి తోడుగా ఉందామంటే నేను అక్కడికి రావడానికి లేదు అని అంటుంది అప్పు నువ్వేం బాధపడకు వదినకి తోడుగా నేను ఉన్నాను తనకు ఏ విధంగా సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అప్పుకి మాటిస్తాడు కళ్యాణ్. ఇదంతా పక్కన పెట్టి నువ్వు పోలీస్ సెలక్షన్ పై దృష్టి పెట్టు, ఈరోజే కదా సెలక్షన్స్ ఎక్కడివిడికి వచ్చాయి అని అడుగుతాడు ఏమో అదంతా ఆలోచించలేదు అని అంటే లేదు నువ్వు ఖచ్చితంగా పోలీస్ సెలక్షన్స్ కి వెళ్ళాలి దాని కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అంటాడు కళ్యాణ్ సరే అని ఫోన్ పెట్టేస్తుంది అప్పు ఇక ఈ మాటలు అన్ని అప్పటికే బయట నుంచొని అనామిక వింటూ ఉంటుంది. కళ్యాణ్ ఫోన్ పెట్టేసి బయటికి వెళ్తూ అనామికను చూసి ఇట్లా దొంగ చాటుగా వినే బుద్ధి నువ్వు ఎప్పటికీ మానవ అని అంటాడు. దొంగ చాటుగా వినాల్సిన కర్మ నాకేం లేదు అని అనామిక అంటుంది ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్న నీ లవర్ తో మాట్లాడటం మాత్రం ఆపవా అని అంటుంది కళ్యాణ్తో వెంటనే అప్పు నా ఫ్రెండ్ అని కళ్యాణ్ అంటాడు. తాళి కట్టిన భార్య ఉండగా మరో ఆడదానితో మాట్లాడేసి బుద్ధులు నీకు ఎలా వచ్చాయో మొన్నటిదాకా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు మీ అన్నయ్యని చూస్తే మీ అందరిదీ ఒకటే రక్తం కదా అందుకే అందరూ అలానే మాట్లాడుతున్నారు అని అంటుంది అనామిక నన్నేమైనా అను కానీ మా అన్నయ్యను అంటే మాత్రం ఊరుకోను అంటాడు కోపంగా నేనున్న మాటే అన్నాను. ఇందులో తప్పేముంది కావ్యముండగా మీ అన్నయ్య మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని బిడ్డను తీసుకొని ఇంటికి రాలేదా అదే మన అబద్దమా అని అంటుంది అనామిక నువ్వు మీ అన్న ఇలా చేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నేనేం కావ్యం అమాయకురాలనైతే కాదు అని అంటుంది అనామిక నువ్వెంత బెదిరించినా కానీ అప్పుతో మాట్లాడడం మానేయను అని కళ్యాణ్ బదిలిస్తాడు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంట్లో ఎలా గొడవలు పెట్టాలనేది కాదు భార్యగా ఎలా నడుచుకోవాలి భర్తని ఎలా అర్థం చేసుకోవాలి ముందు అది నేర్చుకో అని అంటాడు కళ్యాణ్. భర్తగా ఎలా ఉండాలో కూడా నువ్వు నేర్చుకో అని అంటుంది అది నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్.
ఇక మరోవైపు రాజ్ తన కొడుక్కి స్నానం చేయించడానికి వెళ్తూ ఉంటాడు. ఎలా చేయిస్తారని అవి అడుగుతుంది చివరి కింద నుంచో పెడతాను అని అంటాడు ఎందుకు వాడ్ని చేసి రమ్మనండి అని అంటుంది కావ్య వెటకారమా అని అంటాడు రాజ్ లేకపోతే ఏంటి పిల్లాడికి స్నానం చేయించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అని అదంతా కావ్య రాజకీయం చెప్తుంది ఇప్పుడు నాలాంటి పిచ్చిది ఎక్కడ ఉండదని మీరు అనుకుంటున్నారు కదా అని అంటే ఎందుకలా అన్నావు అని అంటాడు రాజ్ లేకపోతే మీ పాపంలో నేను సగం పంచుకుంటున్నాను కదా ఎక్కడైనా భర్త బిడ్డని కానీ ఇంటికి తీసుకొస్తే ఆ బిడ్డకు స్నానం చేయడానికి ఏర్పాట్లు చేసే భార్యను చూశారా నన్ను చూడండి నేను అలాంటి పిచ్చిదాన్ని అని కావ్య తనకు తానే తిట్టుకుంటుంది. మీరు గార్డెన్ లోకి రండి నేను అక్కడ అంతా ఏర్పాటు చేస్తాను అని అంటుంది సరే అని రాజ్ గార్డెన్ లోకి తీసుకువెళ్తాడు.
రేపటి ఎపిసోడ్ లో సుభాష్, ఒక కంపెనీకి పంపించాల్సిన ప్రపోజల్స్ ఇంకా ఎందుకు పంపించలేదు అని ప్రకాశాన్ని అడుగుతాడు ప్రకాశం లేదన్నయ్యా నేను చూస్తాను అని అంటాడు ఇక అప్పుడు అక్కడ ఉన్న ధాన్యం ఎందుకు దాచిపెడుతున్నారు నిజం చెప్పండి అని ప్రకాశం మీద అరుస్తుంది వెంటనే సుభాష్ ఏం జరిగింది అని అడుగుతాడు ధాన్యం ఈ ప్రపోజల్ పంపించకపోవడం వల్ల కంపెనీకి కోటి రూపాయలు నష్టం వచ్చింది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు సుభాష్ అవును రాజు వల్లే ఈ నష్టం వచ్చింది అని అందరి ముందు ధాన్యలక్ష్మి సుభాష్ తో చెబుతుంది. అదంతా ఇంట్లో వాళ్ళందరూ విని షాక్ అవుతారు రాజ్ కూడా అక్కడే ఉంటాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!