ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైజ్` గత ఏడాది ఆఖరిలో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రూ.350 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి అల్లుఅర్జున్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తే.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు. అనసూయ భరధ్వాజ్, అజయ్ ఘోష్, రావు రమేష్ కీలక పాత్రలను పోషిస్తే.. సమంత `ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా` అనే ఐటెం సాంగ్ చేసి ఇండియా వైడ్గా ఓ ఊపు ఊపేసింది.
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2గా `పుష్ప ది రూల్` రాబోతోంది. ఇటీవలె ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు. అయితే తాజాగా `పుష్ప 2` ఫస్ట్ షెడ్యూల్కు సంబంధించి నయా అప్డేట్ బయటకు వచ్చింది. `పుష్ప 2` తొలి షెడ్యూల్ ను డైరెక్టర్ సుక్కు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట.
ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ బ్యాంకాక్లో ప్రారంభించనున్నారట. ఈ మేరకు అల్లు అర్జున్, సుకుమార్ టీమ్ బ్యాంకాక్కు పయనం కానుందని తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరపనున్నారట. అనంతరం టర్కీలో ఓ షెడ్యూల్ చేస్తారట.