Hanuman: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “అఖండ” సినిమా తర్వాత 2022లో ఫుల్ విశ్రాంతి తీసుకున్న బాలయ్య బాబు 2023లో రెండు సినిమాలు విడుదల చేసి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నారు. గత ఏడాది సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి” దసరా పండుగకు “భగవంత్ కేసరి” సినిమాలతో హిట్స్ అందుకున్నారు. చాలా వరకు కురదర్శకులతో పనిచేయడానికి బాలకృష్ణ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ రకంగానే ఇప్పుడు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి బాలకృష్ణ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. సినిమాకి మొదటి షో నుండే పాజిటివ్ టాక్స్ రావటం జరిగాయి. హీరోగా తేజ సజ్జా మొదటి సినిమాతోనే ఓ రేంజ్ లో ప్రేక్షకులను అదరించటం జరిగింది. అంతకుముందు బాధ నటుడిగా చాలామంది స్టార్ హీరోల సినిమాలతో గుర్తింపు పొందిన తేజ సజ్జా..ఫస్ట్ మూవీ “హనుమాన్” తో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేశాడు. భారీ ఎత్తున ఈ సినిమాలో హీరోయిజం దర్శకుడు చూపించడం జరిగింది. ఈ క్రమంలో బెనిఫిట్ షోల్పడిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత వర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ సినిమాకి ఉత్తరాదిలో అద్భుతమైన విశేషణ స్పందన వస్తుందని చెప్పుకొచ్చారు.
“కేజిఎఫ్” లో యాష్ నీ చూపించినట్లుగా ఈ సినిమాలో తేజ సజ్జానీ చూపించామని వస్తున్న కామెంట్స్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. హనుమాన్ సినిమా ఫలితం పైన తన తదుపరి సినిమా ఆధారపడి ఉందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఆల్రెడీ బాలకృష్ణ కి స్క్రిప్ట్ వినిపించడం జరిగిందని..అన్నారు. ఆయన నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. అది కావాలంటే సినిమాటిక్ యూనివర్సల్ లో పెట్టొచ్చు. లేదంటే సపరేట్ గా ఆయన తీయొచ్చు. ఏదేమైనా బాలయ్య నిర్ణయం ఫైనల్ అని అన్నారు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకోవడంతో కచ్చితంగా బాలయ్యతో ప్రశాంత్ వర్మ సినిమా కన్ఫామ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!