టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈయన హీరోగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన `కార్తికేయ 2` ఆగస్టు 13న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు.
2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `కార్తికేయ`కు ఇది సీక్వెల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అనుపమ్ ఖేర్, తులసి, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అనేక వాయిదాల అనంతరం రిలీజ్ అయిన ఈ చిత్రం.. సౌత్ తో పాటు నార్ల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..15 రోజులలోపే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్గా మారిన నిఖిల్.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం రూ. 1116 లే అట. అవును, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. కేవలం 1116/- రూపాయల పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలో ఎదిగాడు.
ఎలాంటి బ్యాక్ గ్రాండ్ లేకపోయినా హీరోగా నిలదొక్కుకుని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు `కార్తికేయ 2` చిత్రంతో సౌత్తో పాటు నార్త్లోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనడానికి నిఖిల్ ప్రయాణం నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!