Jai Hanuman New Poster: ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడం అంటే ఏంటో చాటి చెప్పిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది హనుమాన్ మూవీ తో టాలీవుడ్ లోనే అని కాదు మొత్తం ఇండియా సినిమాల్లోనే సంచలనం సృష్టించింది ఈ మూవీ. ఇప్పుడు ఈ మూవీకి జై హనుమాన్ పేరుతో సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సీక్వెల్ ని ప్రారంభించిన ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశాడు. తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. రూ. 90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ నిలిచింది.
దీంతో ఈ మూవీకి జై హనుమాన్ పేరుతో సీక్వెల్ తీసుకు వస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఇక ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే ఈ పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో ఓ ఎత్తయిన శిఖరంపై చేతిలో గతతో హనుమాన్ నిల్చగా.. పైన గాల్లో నుంచి నిప్పులు కక్కుతూ ఓ డ్రాగన్ వస్తున్నట్లుగా ఈ పోస్టర్ రూపొందింది. ఇండియన్ సినిమాలో తొలిసారి డ్రాగన్లను ప్రశాంత్ వర్మ తీసుకొస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే స్పష్టం అవుతుంది. అంతేకాదు హనుమాన్ కంటే ఈ జై హనుమాన్ మరో రేంజ్ లో వసూలు సాధించే విధంగా కనిపిస్తుంది.
హనుమాన్ మూవీ అంచనాలకు మించి హిట్ అవడంతో సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో సినిమా ఇది. మొత్తంగా ఇండియన్ సూపర్ హీరోల సినిమాలు 12 తీస్తున్నట్లు గతంలోనే అతడు చెప్పాడు. హనుమాన్ తర్వాత మరో హిందూ దేవుడే సూపర్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు. దీనికి ముందు ఈ సీక్వెల్ జై హనుమాన్ ప్రేక్షకుల ముందు రానుంది.
వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు హనుమాన్ ఎండ్ క్రెడిట్స్ సమయంలోనే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇక ఈ మూవీను ఐమ్యాక్స్ 3డీ వర్షంలోనూ తీసుకురానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ చెప్పారు. మరోవైపు హనుమాన్ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చినా.. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ 25 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. మంగళవారం అనగా ఏప్రిల్ 23 మూవీ మేకర్స్ 100 కోట్ల వేడుకను జరుపుకున్నారు. అంతకుముందే ఈ జై హనుమాన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హనుమంతు అంచనాలు భారీగా పెంచేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడీ జై హనుమాన్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక హనుమాన్ మూవీ వచ్చే ఆదివారం అనగా ఏప్రిల్ 28 సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు ఛానల్ అధికారికంగా ప్రకటించింది.