`కార్తికేయ 2` అనేక వాయిదాల అనంతరం చివరాఖరకు ఆగస్టు 13న గ్రాండ్గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ `కార్తికేయ`కు సీక్వెల్ ఇది. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉండటం, విజువల్స్ రిచ్గా ఉండటం సినిమాకు ప్లస్ అయింది.
దాంతో ఈ సినిమాకి తక్కువ థియేటర్లు దొరికినా.. బాక్సాఫీస్ వద్ద మాస్ బీభత్సం సృష్టిస్తోంది. పైగా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను నిఖిల్ చిత్తు చిత్తు చేసేశారు. నార్త్లోనూ ఈ మూవీకి మంచి స్పందన దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3.50 కోట్లు, రెండో రోజు రూ. 3.81 కోట్ల రేంజ్లో షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 4.23 కోట్ల షేర్ ను రాబట్టి అదరగొట్టేసింది. ఇక ఏరియాల వారీగా `కార్తికేయ 2` 3 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 4.06 కోట్లు
సీడెడ్: 1.83 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.51 కోట్లు
తూర్పు: 0.99 కోట్లు
పశ్చిమ: 0.73 కోట్లు
గుంటూరు: 1.14 కోట్లు
కృష్ణ: 0.87 కోట్లు
నెల్లూరు: 0.41 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ= 11.54 కోట్లు(17.80కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటఖ+రెస్టాఫ్ ఇండియా: 0.70 కోట్లు
ఓవర్సీస్: 2.60 కోట్లు
నార్త్ ఇండియా: 0.60 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 15.44 కోట్లు(26.50 కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 12.80 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగుతోంది. అయితే మూడొవ రోజు సాధించిన కలెక్షన్స్తో బ్రేక్ ఈవెట్ టార్గెట్కు క్రాస్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు రూ. 2.14 కోట్ల లాభాలతో దూసుకెళ్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!