టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవలె `లైగర్` వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ను అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఫస్ట్ వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. 5వ రోజు దారుణమైన కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం రూ. 12 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్గా రూ. 70 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకోవడంతో.. నెటిజన్లు లైగర్ థియేటర్స్లో దుకాణం సద్దుకోవాల్సిందే అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే వరల్డ్ వైడ్ గా లైగర్ ఐదు రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 5.62 కోట్లు
సీడెడ్: 1.83 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.73 కోట్లు
తూర్పు: 0.87 కోట్లు
పశ్చిమ: 0.55 కోట్లు
గుంటూరు: 1.00 కోట్లు
కృష్ణ: 0.68 కోట్లు
నెల్లూరు: 0. 53 కోట్లు
——————————–
ఏపీ+తెలంగాణ= 12.81 కోట్లు(21.50 కోట్లు~ గ్రాస్)
——————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 1.47 కోట్లు
ఇతర భాషలు: 0.77 కోట్లు
హిందీ: 6.75 కోట్లు
ఓవర్సీ: 3.34 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 25.14 కోట్లు(52.40కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో రూ. 25.14 కోట్లను రాబట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఇంకా రూ. 64.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ రేంజ్ వసూళ్లను రాబట్టడం కష్టమే అని, లైగర్ వల్ల నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!