Madhuranagarilo April 10 2024 Episode 334: రాధా రుక్మిణికి ఫోన్ చేస్తుంది ఫోన్ స్విచాఫ్ రావడంతో కంగారు పడుతుంది. బాధపడకు రాదా పండుని ఎలాగైనా పట్టుకుందాం అని శ్యామ్ అంటాడు. ఇంతలో మధుర ఫోన్ చేసి పండు ని తీసుకురావడానికి రాధా స్కూల్ దగ్గరికి వెళ్ళింది అని అడుగుతుంది. అమ్మ పండు స్కూల్ దగ్గర లేడు నేను రాధా పండు కోసం వెతుకుతున్నాం అని శ్యామ్ చెబుతాడు. పండు నీ ఎవరు తీసుకు వెళ్లారు రా అని మధుర అంటుంది. ఇంకెవరు రుక్మిణి వచ్చి తీసుకెళ్ళింది అంట అని శ్యామ్ చెబుతాడు. శ్యామ్ రాధా పండు కోసం వెతుకుతూ ఉంటారు.కట్ చేస్తే,వాళ్లకు తెలిసిన హోటల్స్ రెస్టారెంట్లు అన్ని అడిగి తెలుసుకుంటారు కానీ అక్కడ పండు లేకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది రాదా. ఇంకెక్కడికి తీసుకెళ్ళు ఉంటుందండి అని రాదా బాధపడుతుంది.
కట్ చేస్తే, పిల్లలందరూ పండు కి హ్యాపీ బర్త్డే చెబుతారు. పిల్లలందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. రుక్మిణి పండు కోసం స్పెషల్ కూల్ డ్రింక్స్ తయారు చేస్తుంది. పండుని తీసుకురా పిన్ని ఇది పండు కోసం తయారు చేశాను ఇది తాగడానికి రోజు నా దగ్గరికి వస్తాడు అని రుక్మిణి చెబుతుంది. దాక్షాయిని పండు దగ్గరికి వెళ్లి పండు మీ అమ్మ నీకోసం స్పెషల్ కూల్ డ్రింక్ తయారు చేసింది తాగుదువురా అని తీసుకు వెళ్తుంది. పండు ఈ కూల్ డ్రింక్స్ తాగు నీ కోసమే ఫారెన్ నుంచి తెప్పించాను అని రుక్మిణి అంటుంది. పండు అది తాగే చాలా బాగుంది మమ్మీ ఎప్పుడు ఇలాంటి కూల్డ్రింక్స్ తాగలేదు అని అంటాడు. అవునా నాన్న నీ కోసమే వారం నుంచి తెప్పించాను ఇకమీదట రోజు వచ్చి కూలింగ్ తాగి వెళ్ళు అని రుక్మిణి చెబుతుంది. కూల్ డ్రింక్స్ తాగిన పండు మత్తులో డాన్స్ వేస్తాడు.
అలా డాన్స్ వేస్తూ ఉండగా తనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి ఇంతలో రుక్మిణి అది గమనించి పండు కేక్ కట్ చేద్దాం పద అని అంటుంది. కట్ చేస్తే, అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు హ్యాపీ బర్త్డే పాట పాడుతూ ఉంటారు పండు కేక్ కట్ చేస్తూ ఉండగా తనకు కళ్ళు తిరిగినట్టు అయ్యి కింద పడిపోతూ ఉండగా ఇంతలో శ్యామ్ వచ్చి పండుని పట్టుకుంటాడు. పండు కళ్ళు తిరిగి పడిపోయాడు వాడికి ఏమి ఇచ్చావు అని శ్యామ్ అడుగుతాడు. నా కొడుక్కి నేను ఏమైనా ఇస్తాను అడగడానికి నువ్వు ఎవరు అని రుక్మిణి అంటుంది. శ్యామ్ కోపంతో చంప పగలగొడతాడు. ఇప్పుడు చెప్పు పండు కి నేను తండ్రిని పండుకి ఏం తాగించావ్ అని అంటాడు.
రాధా లేచి వచ్చి రుక్మిణి ఆచంపై చెంప వాయిస్తుంది. రాధా నా గెస్ట్ హౌస్ కి వచ్చి నన్నే కొడతారా పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని ఇద్దరిని పట్టిస్తాను అని రుక్మిణి అంటుంది. ఫోన్ చేస్తావా చేయవే చెయ్ మధురానగర్ కాలనీ లాక్కొని ఈ గెస్ట్ రోజులు కూడా లాక్కున్నావని నాకు తెలుసు పండు బర్త్డే ఇక్కడే చేస్తావని గెస్ చేశాను అప్పుడే పోలీసులు తీసుకుని వస్తే నిన్నే అరెస్టు చేసేవారు అని శ్యామ్ అంటాడు. రుక్మిణి భయపడిపోతుంది. పండు ని తీసుకొని రాధాశం హాస్పిటల్ కి వెళ్తారు. ఇంతలో మధుర ఫోన్ చేసి పండు ఆచూకీ దొరికిందా అని అంటుంది.
అమ్మ పండు మాట్లాడే పరిస్థితిలో లేడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని శ్యామ్ చెబుతాడు. కట్ చేస్తే పండుని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. పండు కి ఏమైంది అని డాక్టర్ గారు అడుగుతారు. శ్యామ్ జరిగిందంతా చెబుతాడు వెంటనే ఐసీలోకి తీసుకువెళ్లే టెస్ట్ చేస్తూ ఉంటుంది డాక్టర్. ఇంతలో మధురా ధనంజయ్ అక్కడికి వస్తారు. రాధా మధుర మీద పడి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఇదంతా నా తప్పే అత్తయ్య నా వల్లే జరిగింది పండు నీ స్కూల్ కి పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచుకుంటే ఆ రాక్షసి తీసుకు వెళ్ళేది కాదు ఇదంతా నా తప్పే అత్తయ్య అని తల కొట్టుకుంటూ ఏడుస్తుంది రాదా. ఇందులో నీ తప్పేముంది రాదా? పండు ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉండాలనుకున్నావు ఎందుకు రాధా బాధపడుతూ పండుకు ఏం కాదు అని మధుర ఓదారుస్తుంది.
ఇంతలో డాక్టర్ గారు బయటకి వస్తారు. డాక్టర్ గారు మా పండు కి ఎలా ఉంది అని శ్యామ్ అడుగుతాడు. తన కండిషన్ చాలా ప్రమాదకరంగా ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెబుతుంది.అయితే ఆపరేషన్ కి తయారు చేయండి డాక్టర్ అని శ్యామ్ చెబుతాడు. ఆపరేషన్ కి 25 లక్షలు ఖర్చు అవుతాయి అని డాక్టర్ చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!