Madhuranagarilo April 2 2024 Episode 328: రుక్మిణి.దిష్టి తీసి నిళ్ళు పారబోస్తూ ఉండగా రుక్మిణి ఎదురు వస్తుంది తనమీద చూసుకోకుండా నీళ్లు పడిపోతాయి. దిష్టి తీసిన నీళ్లు నామీద పోస్తావా నీకు ఎంత ధైర్యం నా డ్రెస్ అంత పాడు చేసావ్ అని రుక్మిణి అంటుంది. నేను నీళ్లు పారబోసేటప్పుడు అక్కడ ఎవరూ లేరమ్మ నేను పోసాక నువ్వు వచ్చి నిలబడి ఉంటావు అవి పడ్డాయి నా తప్పేమీ లేదు అంటూ మధుర వెళ్ళిపోతుంది.చూసావా రుక్మిణి మా వదినకు ఆస్తిఅంతా పోయి రోడ్డున పడ్డ పొగరు తగ్గలేదు అని దాక్షాయిని అంటుంది. ఆ పొగరు తగేల కదా నా మీద నీళ్లు పోసినందుకు తగిన అవమానం చేసి పంపిస్తాను అని రుక్మిణి అంటుంది. రుక్మిణి దాక్షాయానికి ఒక ప్లాన్ చెబుతుంది. అలాగే చేద్దామని దాక్షాయని అంటుంది. కట్ చేస్తే, రాదా ఇక వెళ్లి వస్తానండి అని అంటుంది.ఏదో సాయమడగడానికి వచ్చి అడగకుండానే వెళ్ళిపోతావేంటమ్మా అని అతను అంటాడు. ఏమీ లేదు సార్ మా ఆయనకి చిన్న ఉద్యోగం కావాలి మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిస్తారా అని రాదా అడుగుతుంది.
నిన్ను చేసుకున్నాక మీ ఆయన ఉద్యోగం చేయాల్సిన పనేంటమ్మా అని అతను అంటాడు. మహాలక్ష్మి లాంటి నిన్ను కట్టుకున్నాక అతను ఉద్యోగం కోసం వెతుక్కోవడమేంటి అని అతను అంటాడు.నన్ను చేసుకోకముందు ఆయన బాగానే ఉండేవారు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నన్ను చేసుకున్నకే నా దురదృష్టం ఆయనకు అంటుకొని ఆసంతా పోగొట్టుకొని రోడ్డున పడ్డాడు అని రాదా బాధపడుతుంది. అలా అనకమా నువ్వు వచ్చాకే ఆస్తి అంత పోయినా ప్రాణమైన నిలబడింది అతని అదృష్టం అని అతను అంటాడు. సరేనమ్మా మీ ఆయనకి మా కొడుకు తో మాట్లాడి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను అని అతను అంటాడు. చాలా థాంక్స్ అండి మీ మేలు ఈ జన్మలకి మర్చిపోలేను అని రాదా అంటుంది. చిన్న ఉద్యోగం ఇస్తేనే నా రుణం మర్చిపోలేను అంటున్నావు మరి నా ప్రాణాన్ని కాపాడిన దావతవి నీ రుణం ఎన్ని జన్మలెత్తి తీర్చుకోగలనమ్మా అని అతను అంటాడు.
సరే సార్ వెళ్ళొస్తాను అంటూ రాధా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, దాక్షాయిని అమ్మాయి దగ్గరికి వెళ్లి పాపని నగలు బాగున్నాయి అంటూ నగలు చూసినట్టు చూసి ఒక వజ్రాల నాగ కొట్టేస్తుంది. ఆ నెక్లెస్ తీసుకువెళ్లి మధుర సంచిలో వేస్తుంది.మళ్లీ ఏమీతెలియనట్టు రుక్మిణి దాక్షాయని అక్కడికి వచ్చి ఏమండీ మీ పాప మెడలో ఇందాక వజ్రాలన నక్లిస్ ఉండేది ఇప్పుడు లేదేంటి ఎక్కడైనా పోయిందా లేదంటే తీసి దాచి పెట్టారా అని రుక్మిణి అంటుంది. నేను తీయలేదు అంటూ ఎక్కడ పడిపోయిందో అని వెతుకుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అలా వెతికితే ఎక్కడ దొరుకుతుంది అందరి సంచుల్లో చూడండి ఎవరైనా తీసారేమో అని రుక్మని అంటుంది. అందరి సంచులు చూస్తారు వజ్రాల నక్లిస్ కనిపించకపోయేసరికి దొరకలేదని బాధపడుతూ ఉంటారు. అందరి సంచులు చూశారు ఈవిడ సంచి మాత్రం చూడలేదు అని రుక్మిణి అంటుంది. ఆవిడ సంచి
చూడవసరం లేదు ఆవిడ తీయదు అని ఆఅమ్మాయి వాళ్ళ నాన్న అంటాడు.చూస్తే కదా తెలిసేది అని రుక్మిణి అంటుంది. నా దగ్గర స్వీట్లు తప్ప ఏమీ లేవు చూసుకోండి అని సంచిని ఇస్తుంది మధుర. అసంచి ఓపెన్ చేసి చూడగానే అందులో వజ్రాలు నక్లీస్ కనిపిస్తుంది. చెప్పేవన్నీ శ్రీరంగనీతులు చేసేవన్నీ దొంగ బుద్ధులు నీతులు చెప్పే సరిపోదండి బ్రతుకు కూడా నీతి గానే బ్రతకాలి అని రుక్మిణి అంటుంది. ఆవిడ మనసు చల్లనిది ఆవిడ ఆశీర్వదించాలని ఆ బిడ్డను తీసుకువచ్చారు కదా ఇప్పుడు చూశారా ఆవిడ మనసు దొంగ బుద్ధి అని వాళ్ళ ఆవిడ అంటుంది. ఇలాంటి పని చేస్తావని అసలు అనుకోలేదు అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అతను అంటాడు. మధుర కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ప్లాన్ సక్సెస్ అయినందుకు దాక్షాయిని రుక్మిణి సంతోషిస్తారు.కట్ చేస్తే,మధుర ఇంటికి వచ్చి బాధపడుతూ కూర్చుంటుంది ఏం జరిగింది అత్తయ్య అని రాదా అడుగుతుంది. రాదా ను కౌగిలించుకొని ఏడుస్తుంది మధుర. ఏమైందత్తయ్య అని రాధా అంటుంది. తెలిసిన వాళ్ళ ఫంక్షన్ అని వెళ్లాను అక్కడికి ఎంతో గౌరవంగా వెళ్లిన నేను దొంగని ముద్ర పడి బయటికి వచ్చాను అని మధుర అక్కడ జరిగిన విషయం అంత చెబుతుంది. మనల్ని రోడ్డున పడేసిన దానికి సరిపోలేదన్నమాట ఇంకా మనల్ని వేధిస్తూనే ఉంది అలాంటి అక్క చెల్లెలుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అని రాదా అంటుంది.నువ్వెందుకమ్మా సిగ్గు పడడం నీలాంటి చెల్లెలికి తను అక్క ఆయన అందుకు తనను తానే చూసుకొని సిగ్గుపడాలి అని మధుర అంటుంది.
కట్ చేస్తే, సాయిబాబా గుళ్లో ఒక అమ్మాయి నిలివి దోపిడీ ఇస్తూ ఉంటుంది.అది చూసినా రుక్మిణి ఆ అమ్మాయి ఏంటి నగలన్నీ తీసేస్తుంది అని అడుగుతుంది. దాన్నే నిలువు దోపిడి అంటారమ్మ ఆ అమ్మాయి ఏదో మొక్కుకున్నట్టు ఉంది అందుకే కోరిక తీరడంతో నిలువు దోపిడీస్తుంది అని దాక్షాయని చెబుతుంది. అలా చేస్తే కోరికలు తీరుతాయా అని రుక్మిణి అడుగుతుంది. అలా మొక్కుకొని నిలువు దోపిడీ ఇస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అని దాక్షాయణి చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!