Madhuranagarilo February 28 2024 Episode 299: రుక్మిణి ఒక దగ్గర ఆటో ఆపి దిగిపోతుంది. కిరణ్ అదే ఆటో వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఆటో ఆపి ఈ ఆటలో ఒక అమ్మాయి ఎక్కింది కదా తన ఏది అని కిరణ్ అడుగుతాడు. ఆ అమ్మాయి అక్కడే దిగిపోయింది సార్ అని ఆటో అతను చెబుతాడు. వెంటనే శ్యామ్ కి ఫోన్ చేసి చెప్తాడు కిరణ్. అలా ఎలా జరిగింది రా అని శ్యామ్ అంటాడు. తను నన్ను కనిపెట్టి డ్రాప్ అయిపోయినట్టుంది రా అని కిరణ్ అంటాడు. కట్ చేస్తే. రుక్మిణి మనోహర్ దగ్గరికి వెళుతుంది. ఏంటి మనోహర్ అర్జెంట్గా రమ్మన్నావు అని రుక్మిణి అడుగుతుంది. అర్జెంటుగా నాకు ఐదు కోట్లు కావాలి అని మనోహర్ అంటాడు.
ఐదు రూపాయలు అడిగినంత ఈజీగా ఐదు కోట్లుఅడుగుతున్నా వేంటి ఎక్కడి నుంచి వస్తాయి అని రుక్మిణి అంటుంది. ఐదు కోట్లు ఇవ్వకపోతే ఐదు కోట్లకు విలువ చేసే నీ అందని నాకు ఇవ్వు చాలు అని మనోహర్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ మనోహర్ అని రుక్మిణి మనోహర్ చంప పగలగొడుతుంది. నీతో కలిసి పని చేస్తున్నానని నీకు లొంగి పోతాను అనుకున్నావా నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని అని రుక్మిణి అంటుంది.రుక్మిణి నువ్వు కనుక నేను చెప్పినట్టు వినకపోతే వెంటనే వెళ్లి మీ చెల్లికి నువ్వు మీ ఆయన మీద ప్రేమతో వెళ్లలేదు ఆస్తి కోసం వచ్చావని చెబుతాను అప్పుడు మీ చెల్లి నిన్ను బయటికి గెంటేస్తుంది
ఎలాగూ రోడ్డుమీద పడతావు కాబట్టి అప్పుడు నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది అప్పుడు ఎలాగు నా సొంతం అవుతావు అని మనోహర్ అంటాడు. గొడవ పడడం కన్నా బిజినెస్ లో ఎలా కలిసి ఉన్నామో లైఫ్ లో కూడా అలాగే కలిసుందాం అని మనోహర్ అంటాడు. మనోహర్ వద్దు ఆ పని చేయొద్దు అని రుక్మిణి అంటుంది. నువ్వు నా చేయి వదిలించుకొని చంప పగలగొట్టినట్టు నేను నీ చేయి వదిలించుకొని చెంప పగలగొట్టాలి కదా అందుకే వెళ్లి మీ చెల్లికి నిజం చెప్పేస్తాను అంటూ మనోహర్ రుక్మిణిని పక్కకి నెట్టేసి కార్ వేసుకుని వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే, రాధా కృష్ణ దగ్గరికి వెళుతుంది. ఏంటి శోభనం పెళ్లికూతురా ఇలా వచ్చావ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చావా అని కృష్ణ అంటుంది. ఊరికే జోక్ చేశాను లే రాదా అని కృష్ణ అంటుంది. శోభనం జరగలేదు ఆగిపోయింది అని రాధా అంటుంది. ఎందుకు అలాంటి పని చేసావే అని కృష్ణ అంటుంది. శ్యామ్ సార్ నా దగ్గరికి వచ్చేసరికి మా అక్కకు ద్రోహం చేస్తున్నానేమో అనిపించింది అందుకే ఆయనని పక్కకు నెట్టేశాను అని రాధా అంటుంది. మీ అక్క కు ద్రోహం చేస్తున్నానని శ్యామ్ సార్ కి ద్రోహం చేస్తున్నావా మీరిద్దరూ దగ్గర కాకపోతే మీకు బిడ్డలా పుడుతూ పుడతాడే అని కృష్ణ అంటుంది. సరోగసి ద్వారా కంటాను శ్యామ్ సార్ ని కాపాడుకుంటాను అని రాదా అంటుంది. అది గర్భసంచి చిన్నగా ఉన్న వాళ్లకి అసలు లేని వాళ్ళకి అర్థ గర్భంతో బిడ్డల్ని కనేలా చేస్తాము అంతేకానీ నీలాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కాదు నేను అందుకు ఒప్పుకోను రాదా అని కృష్ణ అంటుంది. అయితే నీ హాస్పిటల్ ఒక్కటే ఉందా వేరే హాస్పిటల్ కి వెళ్లి అడుగుతాను అంటూ రాదా వెళ్లిపోతుంది.
కట్ చేస్తే, కిరణ్ వెళ్తూ ఉండగా మనోహర్ కనపడతాడు. శ్యామ్ కి వెంటనే ఫోన్ చేస్తాడు కిరణ్. అతన్ని ఫాలో అవ్వరా నేను అక్కడికే వస్తాను అని శ్యామ్ అంటాడు. అలాగే నువ్వు త్వరగా రా రా అని కిరణ్ అంటాడు. కట్ చేస్తే, కృష్ణ మధుర కి ఫోన్ చేస్తుంది. ఏంటి కృష్ణ ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అని మధుర అడుగుతుంది. ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి అని కృష్ణ అంటుంది. ఏ విషయం అమ్మ అని మధుర అడుగుతుంది. శ్యామ్ కి రాధ కి శోభనం జరగలేదు ఆంటీ అని కృష్ణ అంటుంది. ఆడవాళ్ళ ప్రాబ్లం వల్ల జరగలేదమ్మా అని మధుర అంటుంది. కాదా ఆంటీ రాదా శ్యామ్ ని కావాలని దూరం పెట్టింది వాళ్ళ అక్కకు ద్రోహం చేయదంట అని కృష్ణ చెబుతుంది.అలాంటప్పుడు వాళ్లకి బిడ్డ ఎలా పుడతాడమ్మా నా కొడుకు ప్రాణాలు ఎలా కాపాడుతుంది అని మధుర అంటుంది.
సరోగసి ద్వారా బిడ్డను కనీ శ్యామ్ ప్రాణాలు కాపాడుతాను కానీ మాకు మాత్రం ద్రోహం చేయనని రాదా అంటుంది ఆంటీ అని కృష్ణ చెబుతుంది. సరోగసి ద్వారా బిడ్డను కన్నడం ఏంటమ్మా అందుకు నేను ఒప్పుకోను అని మధుర అంటుంది. ఆంటీ ఇప్పుడు ఆ విషయం మీద మనం గొడవ చేస్తే రాదా వేరే హాస్పటల్ కి వెళ్లి బిడ్డను కనడానికి ప్రయత్నిస్తుంది అలా కాకుండా మీరే భార్యాభర్తల అన్యోన్యత గురించి చెప్పండి భార్యాభర్తల ప్రేమానురాగాలకి పుట్టే బిడ్డలు కానీ మందులకు మిషన్లకు పుట్టే వాళ్ళు కాదు దేవుని సృష్టి అలా లేదు అని చెప్పండి అలా చేస్తే రాదా మారి శ్యామ్ ని అంగీకరిస్తుంది లేదంటే రాదా పంతానికి పోయి వాళ్ళ అక్కకు అన్యాయం చేయకూడదని అనుకుంటుంది ఆంటీ అని కృష్ణ చెబుతుంది. అలాగేనమ్మ ఏదో ఒకటి చేస్తాను రాధ మనసు మారుస్తాను అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!