Madhuranagarilo March 16 2024 Episode 314: సరే నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఆస్తి పేపర్లు తీసుకొని నేను వస్తాను అని శ్యామ్ అంటాడు.ఆస్తి పేపర్లు తీసుకొని నువ్వు రావద్దు రాదని పంపించు తెలివి ఉపయోగించి రాధ వెనకాల ఇంకెవరినైనా పంపించావనుకో పండుని శాశ్వతంగా దూరం చేస్తాను పేపర్లు రెడీ చేసి రాదని పంపించాక నాకు ఫోన్ చెయ్యి అని రుక్మిణి చెబుతుంది. విన్నావు కదా రాధా ఆస్తి పేపర్లో నేను రెడీ చేసి తీసుకొస్తాను నువ్వెళ్ళి పండు ని తీసుకురా అని శ్యామ్ వెళ్లిపోతాడు.కట్ చేస్తే,శ్యామ్ ఆస్తి పేపర్లు రెడీ చేసి తీసుకు వస్తాడు. రాధకి ఇచ్చి సంతకం పెట్టండి మీరు ముగ్గురు పండుని తీసుకొద్దాం అని అంటాడు. ధనంజయ సంతకం పెట్టబోతు ఉండగా బావగారు ఒక్కసారి ఆలోచించండి అని చలపతి అంటాడు. పండును తీసుకురావడానికి ఈ మార్గం కాకుండా ఇంకా వేరే మార్గం ఆలోచించమంటున్నాడు అన్నయ్య అని దాక్షాయిని అంటుంది.
ఇప్పుడు అంతా ఆలోచన చేసే టైం లేదు మనకి పండు కన్నా ఆస్తి ఎక్కువేం కాదు అని ధనంజయ్ అంటాడు. వాళ్లు ముగ్గురు పేపర్ల మీద సంతకం పెడతారు. అవి తీసుకుని రాదాఎక్కడికి రావాలో చెప్పు అని రుక్మిణికి ఫోన్ చేస్తుంది. శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి రా అక్కడే ఉన్నాను అని రుక్మిణి చెబుతుంది. రాధా గుడికి వెళుతుంది. కట్ చేస్తే, రాధా రుక్మిణికి ఆస్తి పేపర్లు ఇచ్చి పండు ఎక్కడ అక్క పద దత్తతచ్చేచోటికి వెళ్దాం అని అంటుంది. దత్తత ఏంటి రాధా ఇదంతా నేను ఆడిన నాటకం నన్ను జైల్లో పెట్టి శ్యామ్ పండు ని తీసుకువస్తే వదిలిపెడతానా ఆస్తి కోసం నేను ఆడిన డ్రామా ఇదంతా పండును నేనే కిడ్నాప్ చేయించాను మీ మాట మీరు నిలబెట్టుకున్నారు నా మాట నేను నిలబెట్టుకుంటాను అని రుక్మిణి ఆ రౌడీలకి పండుని వదిలేయమని చెబుతుంది. పండు రాదా దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. పండుని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది రాదా. మమ్మీ పెద్దమ్మ బ్యాడ్ గర్ల్ ఇంకెప్పుడు మన ఇంటికి రానివ్వద్దు అని పండు అంటాడు.
రాధా పండుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళకి నాకు ఆస్తి దక్కింది అని సంతోషపడుతుంది రుక్మిణి. కట్ చేస్తే, రాధా పండు ని తీసుకొని ఇంటికి వస్తుంది. పండు ని మధుర హగ్ చేసుకుని బాధపడుతుంది. రేయ్ పండు ఎలా ఉన్నావ్ రా నాన్న అని ధనంజయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. డాడీ పెద్దమ్మ మంచిది కాదు తను బ్యాడ్ గర్ల్ ఇంకెప్పుడు మన ఇంటికి రానివ్వద్దు అని పండు బాధపడతాడు.అలాగే పండు మీ అమ్మ ఇంకెప్పుడు మీ పెద్దమని ఇంటికి రానివ్వదు నువ్వు ఇంటికి వచ్చావ్ అదే చాలు అని శ్యామ్ అంటాడు. రే శ్యామ్ ఆస్తి పోతే పోయిందిరా మన పండు మనకు దక్కాడు అంతే చాలు అని ధనంజయ్ అంటాడు. ఆ రుక్మిణి ఇంతకు తెగిస్తుందని నేను అనుకోలేదండి పండు ని అడ్డం పెట్టుకొని ఆస్తినంతా తీసుకుంది అని మధుర బాధపడుతుంది.
చలపతి దాక్షాయని మాత్రం పండు తిరిగి వచ్చినందుకు సంతోషమేమో కానీ ఆస్తి పోయిందని బాధలో ఉంటారు. పండు ఇకమీదట నిన్ను ఎవరు ఎక్కడికి తీసుకు వెళ్లారు నాన్న నువ్వు మాతోటే ఉంటావని రాధా అంటుంది. డాడీ నాకు చాలా ఆకలిగా ఉంది బయటికి వెళ్లి తిందామా అని పండు అంటాడు. సరే నాన్న నీ ఇష్టం ఎక్కడికి వెళ్దాం అని శ్యామ్ అంటాడు. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది. తనను చూసి అందరూ కోపంగా ఉంటారు. మళ్లీ ఎందుకు వచ్చావు అని శ్యామ్ అంటాడు. ఇంకా ఏమైనా పాపాలు మిగిలిపోయాయి ఇలా వచ్చావ్ అని రాదా అంటుంది.
మీరు చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నారు నా మాట నేను నిలబెట్టుకున్నాను ఆస్తినంతా నాకిచ్చి కొడుకుని సొంతం చేసుకున్నారు బాగానే ఉంది కానీ ఈ ఆస్తినంత నాకు రాసిచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఉండడానికి వీలు లేదు కదా కట్టు బట్టలతో వెళ్లిపోవాలి పాపం ఇంత రాత్రి వేళ ఎక్కడికని వెళ్తారు అందుకే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీరు ఈ రోజుకి ఈ ఇంట్లో ఆనందంగా ఉండి రేప్పొద్దున్నే కట్టు బట్టలతో వెళ్లిపోవాలి అని రుక్మిణి వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే,ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్నామండీ ఈ ఇల్లు ఇంటికి మనకు ఉన్న అనుబంధం చెప్పలేం ఈ మధురానగర్ కాలనీ మన కుటుంబం అనుకొని ఉమ్మడి కుటుంబం గా కలిసిమెలిసి ఉన్నాం రేయ్ శ్యామ్ నువ్వు ఏడేళ్ల పాటు ఫారన్ ఉన్నా మాకు తోడుగా ఉన్నది ఈ కాలనీ ఏరా అని మధుర అంటుంది.ఈ మధురా నగరి కాలనీ వాసులు కూడా అందరూ మనకు కుటుంబాల మనతో కలిసి ఉంటుంది మధురా ఈ కాలిని కూడా మనకు బిడ్డ లాంటిది అని ధనంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!