Madhuranagarilo సెప్టెంబర్ 28 ఎపిసోడ్ 169: రాధా శ్యామ్ ఏం చేస్తున్నాడు అని ఫోన్ చేస్తుంది ఎంత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి అని బయటికి వచ్చి చూస్తే శ్యామ్ బయట కూర్చుని ఉంటాడు రాధా శ్యామ్ దగ్గరికి వెళ్లి ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు అని అంటుంది. ఏమీ లేదు రాదా మనసంతా బాధగా ఉంది అని శ్యామ్ అంటాడు. మీరు తొందర పడ్డారేమో సార్ అని రాధా అంటుంది. ఎవరైనా నన్ను ఏదైనా అంటే నేను తట్టుకుంటాను కానీ నిన్ను పండును ఏదైనా అంటే కంట్రోల్ చేసుకోలేను రాదా అందుకే అలా మాట్లాడాను అని శ్యామ్ అంటాడు పెద్దవాళ్లు అంటే కోపంలో ఉండి ఆవేశ పడతారు అన్నీ తెలిసిన మీరు కూడా ఏంటి సార్ తొందరపడి పెళ్లయిందని చెప్పేశారు పాపం మేడం ఎంత బాధ పడుతుందో అని రాదా అంటుంది.
అవున్రాధా అమ్మ అన్నం తిననని మొండికేసి లోపలికి వెళ్లి డోర్ వేసుకుని కూర్చుంది నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని శ్యామ్ అంటాడు. ఏంటి సార్ మేడమ్ పొద్దున్నుంచి అన్నం తినకుండా ఉంటే మీరు చూస్తే ఎలా ఊరుకున్నారు అని రాదా అంటుంది. ఏం చేయను రాదా ఎంత బతిమిలాడినా తినట్లేదు మొండికేసి కూర్చుంది అని శ్యామ్ అంటాడు. మీరు ఆవిడ కొడుకే కదా మీరు కూడా మొండికేసి ఆవిడ అన్నం తినేలా చేయండి అని రాదా అంటుంది. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి సార్ రేపు మా బావ అడ్రసు తెలుస్తుంది అని రాధా అంటుంది. అవునా రాదా అయితే మీ బావని పట్టుకొని పండు ఆరోగ్యం కుదుటపడేలా చేయడమే నా కర్తవ్యం అని శ్యామ్ అంటాడు. ఒక పొడుగ్గా మీ అమ్మకి అన్నం తినిపియడం కూడా మీ బాధేతే సార్ వెళ్ళండి ముందు మీ అమ్మకి అన్నం తినిపించండి అని రాదు అంటుంది.
కట్ చేస్తే శామ్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి అన్నం ప్లేట్లో వేసుకొని అమ్మ నాకు బాగా ఆకలి వేస్తుంది డోర్ తీయమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఆకలి తెలియకుండా పెంచావు ఇప్పుడేంటి అమ్మ నాకు ఆకలేస్తుంది అంటున్నాను డోర్ తీయట్లేదు నువ్వు డోర్ తీయవా అనే విషయం చేతిని గోడికేసి కొడతాడు చేతికి రక్తం కారుతుంది అమ్మ అని అరుస్తాడు.శ్యాంకు ఏమైందో నాని మధుర పరిగెత్తుకొచ్చి ఏదిరా సాంగ్ చూడని అని అంటుంది ఏమి అక్కర్లేదు నువ్వు అన్నం తినను అన్నావు కదా అని శ్యామ్ అంటాడు. ఒరేయ్ రక్తం బాగా కారుతుంది చూడనివ్వరా అని మధుర అంటుంది. పోనీయమ్మ నా ఒంట్లో ఉన్న రక్తమంతా పోనీ నువ్వు అన్నం తినను అన్నావు కదా అని అంటాడు.నేనేదో కోపం లో అన్నాను కానీ నీ మొహం చూడకుండా నేను ఎలా ఉంటాను రా ముందు నువ్వు కట్టు కట్టించుకో అని మధుర అంటుంది.
అయితే నేను తెచ్చిన అన్నం తింటావా అని శ్యామ్ అంటాడు. తింటాను రా నువ్వు తెచ్చిన అన్నం కడుపునిండా తింటాను సరేనా అని మధుర ప్లాస్టర్ తీసుకువచ్చి చేతికి అయిన గాయానికి వేస్తుంది. అమ్మ రెండు రోజుల్లో నీకు మంచి శుభవార్త చెబుతాను అని అంటాడు. అవునా నాన్న ఏంటది అని మధురం అంటుంది. ఇప్పుడు కాదని చెప్పాను కదా ముందు నువ్వు అన్నం తిను అని మధుర కి శ్యామ్ అన్నం తిన పెడతాడు. కట్ చేస్తే శైలజ వాళ్ళు ఇవ్వాళ ఫోన్ చేస్తానన్నారు మా బావ ఎవరో తెలిస్తే పండు ఆరోగ్యం కుదుటపడుతుంది అనురాధ తన మనసులో అనుకుంటుంది. అమ్మ ఆకలేస్తుంది టిఫిన్ అయిందా అని పండు అంటాడు. అయిపోయింది నాన్న తెస్తున్నాను అని రాధా టిఫిన్ తెచ్చి పండుకు పెడుతుంది ఏంటి నాన్న తినట్లేదు అని రాధా అంటుంది. రోజు నువ్వే కదా నాకు తినిపిస్తావు ప్లేట్లో పెట్టించి ఆ ఫోన్ కొనుకో చూస్తావ్ ఏంటి అని పండు అంటాడు.
ఏంటే పండును పట్టించుకోకుండా ఫోన్ కొనక చూస్తున్నావ్ అని స్వప్న అంటుంది. ఏమీ లేదే శైలజ వాళ్ళు ఇవాళ ఫోన్ చేస్తానన్నారు అని రాదా అంటుంది. నాకన్నా వాళ్ళు ఇంపార్టెంట్ అమ్మ అని పండు అంటాడు. నీ కన్నా ముందు నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు పండు అని రాధా పండు కి టిఫిన్ పెడుతుంది. అమ్మ నేను వెళ్లి ఆడుకుంటాను అని పండు వెళ్ళిపోతాడు. ఏంటే శైలజ వాళ్ళు ఇంకా ఫోన్ చేయట్లేదు అని రాదా అంటుంది. ఆ లాప్టాప్ రిపేర్ ఇవాళ చేతికి ఇంకా రాలేదేమో లే అందుకే ఫోన్ చేయట్లేదు అని స్వప్న అంటుంది. కట్ చేస్తే మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందా మీ బావ ఫోటో పంపించిందా అని శ్యామ్ అంటాడు.
ఇంకా చేయలేదు సార్ తనే చేస్తానంది కదా అని వెయిట్ చేస్తున్నాను అని రాదా అంటుంది.ఇంతలో శైలజ ఫోన్ చేసి రాధా లాప్టాప్ లో మీ బావగారు ఫోటో మిస్సయింది సారీ అని అంటుంది. పర్వాలేదు మేడం మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకెవరి దగ్గరైనా ఉందేమో ట్రై చేయండి అని రాదా అంటుంది. అలాగే చూస్తాను వాళ్ళ దగ్గర ఉంటే నీకు వెంటనే సెండ్ చేస్తాను అని శైలజ అంటుంది.ఓకే మేడం థాంక్యూ అని రాధా ఫోన్ కట్ చేస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!