టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవలె `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి.
ఇవి కమర్షియల్గా హిట్ అవ్వకపోయినా.. ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ మూవీ ఆగస్టు నెల నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మహేశ్కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నారు.
ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది. ఇకపోతే ఈ మూవీకి మహేశ్ బాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ సినిమాకు గానూ మహేశ్ ఏకంగా రూ. 70 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట.
ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు తీసుకునేవారు అన్న టాక్ ఉంది. కానీ, ఇప్పుడు ఇరవై కోట్లు పెంచి రూ. 70 కోట్లు డిమాండ్ చేశారట. మహేశ్ సక్సెస్ రేటు దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, త్రివిక్రమ్ మూవీ అనంతరం మహేశ్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!