టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో మరో హిట్ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ సినిమా ఒకటి కాగా.. మరొకటి రాజమౌళి చిత్రం. అయితే వీటిలో మహేశ్ మొదట త్రివిక్రమ్ మూవీని కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
`ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయింది. మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్గా మహేశ్ బాబు తన ముద్దుల కుమార్తె సితారతో కలిసి ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు వారు నిర్వహిస్తున్న డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోకి గెస్ట్ గా వచ్చారు.
సెప్టెంబర్ 4న ప్రసారం కానుకున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది. ఇందులో మహేశ్-సితార గ్రాండ్ ఎంట్రీ.. సితార వేదికపై డాన్స్ చేయడం, అది చూసి మహేశ్ మురిసిపోవడం హైలైట్గా నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ షోకు గెస్ట్గా వచ్చినందుకు గానూ మహేశ్ పుచ్చుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ రియాలిటీ షోకు గెస్ట్గా వచ్చినందుకు గానూ మహేశ్ ఏకంగా రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ కింద అందుకున్నారట. ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడం వల్లే మహేష్ ఈ షోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో ఆయనకే తెలియాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!