Malli Nindu Jabili: మల్లి గౌతమ్ లోపలికి వెళ్తారు. కొత్త కోడలు ముందు నా ఇంట్లో దీపం వెలిగించాలి, మల్లి రామ్మ గౌతమ్ నువ్వు కూడా, మల్లి దీపం వెలిగించమ్మా అని కౌసల్య అంటుంది. మల్లి దీపం వెలిగిస్తుంది. మల్లి నీ కాపురం చల్లగా ఉండాలని దండం పెట్టుకో అమ్మ అంటుంది కౌసల్య. అమ్మ దండలు తీసేయండి అంటుంది కౌసల్య. మల్లి లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది అనుకోలేదు అలాగే మా గౌతమ్ కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకుంటాడు అని అనుకోలేదు ఒక తల్లిగా నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను నా ఇంట్లో దీపం పెట్టింది ఈరోజు నుంచి ఇంటి బాధ్యతలు పెత్తనాలు అన్ని నా కోడలివే అని కౌసల్య అంటుంది. నా కూతురు చాలా అమాయకురాలండి బాధపడటమే తెలుసు కానీ బాధ పెట్టడం తెలియదు కన్నీరు పెట్టుకోవడమే తెలుసు కానీ కష్టపెట్టడం తెలియదు పొరపాటున నా కూతురు ఏదైనా తప్పు చేస్తే అమ్మల కడుపులో దాచుకొని కూతురిలా చూసుకోండి అని దండం పెట్టి చెబుతోంది మీరా.
మిమ్మల్ని మర్చిపోయేలా చూసుకుంటాను అని కౌసల్య అంటుంది. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మాకు నమ్మకం కలిగింది అమ్మగారు మీ దగ్గర మా మల్లి జీవితం హాయిగా సాగిపోతాదని అని జగదాంబ అంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నా కూతురు అలవాటు చిన్నప్పుడు అన్ని కష్టాలు చూసేసింది ఇకనుంచి మల్లి కంట్లో నీళ్లు రాకూడదు అలా రాకుండా ఉండడం కోసం ఈ తండ్రి ఏం చేయడానికైనా సిద్ధమే గౌతమ్ మల్లి చెయ్యి ఎప్పటికీ విడిచి పెట్టొద్దు అని శరత్ చంద్ర చెప్తాడు. నా ప్రాణం లా చూసుకుంటాను అంకుల్ అని గౌతమ్ చెప్తాడు. అమాయక మేము బయలుదేరుతాం అని మీరా చెప్తుంది. భోజనం తిని వెళ్ళండి అని అడుగుతుంది కౌసల్య. ఈసారి వచ్చినప్పుడు తింటాంలేండి అని మీరా చెప్తుంది. ఇప్పుడేమీ వద్దమ్మా మళ్లీ మళ్లీ వస్తుంటాం కదా అని జగదాంబ అంటుంది. మల్లి జాగ్రత్త అమ్మ మేము బయలుదేరుతాము,ఉంటాను బాబు అని మీరా చెప్తుంది. మేడం అమ్మ వాళ్ళని పంపించేసి వస్తాను అని మల్లి వెళ్తుంది. గౌతమ్ నువ్వు రా నాన్న అని కౌసల్య లోపలికి తీసుకెళ్తుంది. మల్లి ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావ్ అని మీరా అడుగుతుంది. భయమేస్తుంది అమ్మ అని ఏడుస్తుంది మల్లి.
నువ్వు ఉన్న ఇల్లు నీకు తెలిసిన మనుషులు భయమెందుకు అమ్మ అని శరత్ అంటాడు. అప్పుడంటే అతిధి ఇప్పుడు కోడలు అయింది భయం ఉండడం సహజమే అల్లుడు అని జగదాంబ చెప్తుంది. కౌసల్య అమ్మగారిలో నాకు అత్త కనిపించడం లేదు అమ్మే కనిపిస్తుంది భయపడకు మల్లి,మా మల్లి నిండు జాబిల్లి లాంటిదని అందరి దగ్గర చెప్పుకొని మురిసిపోయేదాన్ని కదా ఇప్పుడు నీ జీవితానికి అసలైన నిండుతనం వచ్చింది మల్లి, అరవింద్ బాబు గారి ఇంట్లో కోడలిగా మహారాణి బోగం అనుభవిస్తున్నావు అనుకున్నాను, మళ్లీ దేవుడు నీకు వరం ప్రసాదించి నిన్ను ఈ ఇంటికి కోడలు చేశాడు, ధనవంతులు ఇంటికి కోడలు అవడం వేరు గుణవంతుల ఇంటికి కోడలవడం వేరు మంచి ఇంటికి కోడలు అయినావు, గతం మర్చిపోయి బతుకమ్మ అని మీరా చెప్తుంది. నీకు అరవింద్ బాబు గారికి పెళ్లి అయిన విషయం మీకు గొడవలైన విషయం తెలిసి కూడా గౌతం బాబు నిన్ను మనువాడాడు అంటే ఆ బాబుది చాలా గొప్ప మనసు అమ్మ అందుకే జరిగిపోయిన దాని గురించి పదేపదే తలుచుకోకు అని జగదాంబ చెప్తుంది.
ఈ జీవితానికి మరో పెళ్లి వద్దనుకున్నాను నువ్వు మాలిని అక్క ఒప్పించేసరికి తప్పించుకోలేకపోయానమ్మ అని మల్లి అంటుంది. గౌతమ్ వస్తూ ఉంటాడు మల్లి దగ్గరికి.నువ్వు లెటర్ లో చెప్పేసావ్ కాబట్టి అరవింద్ గారితో నీకు పెళ్లి అయిన విషయం మళ్ళీ గౌతమ్ బాబు దగ్గర ప్రస్తావన చేయకు అని మీరా చెప్తుంది. నీ ప్రవర్తన నీ పాత జీవితాన్ని గుర్తు చేయకూడదు అప్పుడే మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు అని జగదాంబ చెబుతుంది.మళ్లీ ఇంట్లోకి అడుగు పెట్టి ఎంతసేపు కాలేదు చాలాసేపు బయట ఉండడం మంచిది కాదు లోపలికి తీసుకురా అని అమ్మ పంపించింది అని గౌతమ్ అంటాడు.సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంత సేపా ఏం మాట్లాడుకుంటున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని గౌతమ్ అడుగుతాడు. కాపురానికి పంపించినప్పుడు ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు చెప్పుకునే జాగ్రత్తలు ఉంటాయి కదా బాబు అని మీరా అంటుంది. చూడండి ఆంటీ మల్లి తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలో నా ముందుంచింది ఒక లెటర్ లో తన గురించి తన జీవితం గురించి క్లుప్తంగా నాకు అర్థం అయ్యేలా రాసింది ఆ లెటర్ ని మల్లి మనసుని ఆ సంఘటనని పూర్తిగా అర్థం చేసుకున్నాను మల్లి గురించి మీరు కంగారు పడకండి నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను సరేనా అని గౌతమ్ అంటాడు. మీలాంటి మంచి మనసున్న భర్త దొరకడం మల్లి అదృష్టం బాబు అని మీరా అంటుంది. మా ఇంట్లో దీపం వెలిగించింది అది ఎంత కాంతితో వెలుగుతుందో మల్లి జీవితం కూడా అలాగే ఉంటుంది ఇక మీరు బయలుదేరండి మళ్లీకి ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు.
వెళ్తాము బాబు ముందు మీరు మల్లి లోపలికి వెళ్ళండి అంటుంది మీరా. మీరా వెళ్దామా అని శరత్ అడుగుతాడు. మీరా వాళ్ళు వెళ్లిపోతారు. కట్ చేస్తే తెల్లవారుజామున మల్లి పూజ చేసి ఇల్లంతా సాంబ్రాణి వేస్తుంది. కౌసల్య నీలిమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు గౌతమ్ కూడా వస్తాడు. మల్లి టిఫిన్ చేద్దాం రా అని గౌతమ్ పిలుస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కమలమ్మను మల్లి వంట గదిలోకి వెళ్ళనివ్వలేదు తనే వంట చేస్తానని చెప్పింది.మల్లి తో చేయించొద్దు అని చెప్పాను కదా అని గౌతమ్ అంటాడు. నా చేతి వంట రుచి చూపిద్దామని ఉండాను బాబు గారు అంటుంది మల్లి. మల్లి చపాతీలు తీసుకొని వస్తుంది అందరికీ వడ్డిస్తుంది. ఆ చపాతీలు తునగనకపోవడంతో గౌతమ్ సీజర్ తెచ్చి కత్తిరిస్తాడు. రేయ్ గౌతమ్ నా కోడలు వంటకి పేరు పెట్టకు అని అంటుంది కౌసల్య. మరి ఎలా తినాలి అమ్మ అని అడుగుతాడు గౌతమ్. తర్వాత మల్లి గౌతమ్ కి తినిపిస్తుంది. మల్లి చపాతి నిజంగా చాలా బాగుందమ్మా అని అంటుంది కౌసల్య.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!