Malli Nindu Jabili: చూడు మల్లి నిన్నటి వరకు ఇంతకుముందు ఉన్న గుర్తింపు వేరు, ఇప్పుడు వైఫ్ అఫ్ గౌతమ్ నంద,నా భార్య ఎప్పుడు భార్య లాగా ఉండాలి పని మనిషి లాగా కాదు, జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పడుతుంది, ఆ కాస్త సమయంలోనే జీవితం విలువ తెలుస్తుంది నువ్వు అన్నిటిని ఎదుర్కొని వచ్చిందానివి ఇప్పుడు నీకు మంచి రోజులు వచ్చాయి నా భార్యగా నువ్వు మహారాణిలా బతకాలి బానిసలా కాదు, ఇప్పుడు నీది స్వయంగా పనులు చేసుకునే రేంజ్ కాదు పని వాళ్ళ చేత పనులు చేయించుకునే రేంజ్ గుర్తుపెట్టుకో నా ఇంటెన్షన్ నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా అని అడుగుతాడు గౌతమ్.
అర్థమైంది కానీ, ఈ విషయాన్ని అంత కోపంగా చెప్పాలా ఎంత భయపడ్డానో తెలుసా నేను మల్లి చెప్తుంది.నా ఒపీనియన్ ఏంటంటే కోపంతో చెప్పే వాటినే సొంత వాళ్ళయినా పరాయి వాళ్ళయినా ఆచరిస్తారని బాగా గుర్తు పెట్టుకుంటారు అని నేను అనుకుంటాను అని గౌతమ్ చెప్తాడు.అయితే మీ అభిప్రాయాన్ని కాస్త సవరించుకోండి ప్రేమగా చెప్పిన కూడా గుర్తుంచుకుంటారు ఆచరిస్తారు అని మల్లి చెప్తుంది. అవునా అయితే నా మల్లి భయం పోగొడతాను అంటాడు గౌతం. ఇంతలో నీలిమ వచ్చి కొత్త జంటని డిస్టర్బ్ చేశానా అంటుంది. అమ్మ ఇద్దరినీ పీల్చుకొని రమ్మన్నది, ఇప్పుడు వస్తారా కాసేపు అయ్యాక వస్తారని చెప్పమంటారా అని నీలిమ అడుగుతుంది. వస్తున్నాం అని గౌతమ్ చెప్తాడు.ఎందుకు రమ్మన్నావ్ అమ్మ పంతులు గారిని పిలిపించావ్ ఏంటి అని అడుగుతాడు గౌతం. చెప్తాను ఇలా వచ్చి కూర్చోండి అంటుంది కౌసల్య. పిలిపించిన విషయం గురించి చెప్పు అని నీలిమ అంటుంది.
ఏం లేదు గౌతం పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం గురించి ముహూర్తం పెట్టించడానికి పిలిపించాను అంటుంది కౌసల్య. ఇక ముహూర్తం చూడండి పంతులు గారు అని కౌసల్య చెప్తుంది. అమ్మ వచ్చే 15 రోజుల వరకు మంచి ముహార్తలు లేవు అని చెప్తాడు పంతులు గారు.దోషం ఉన్నప్పుడు ఎదురెళ్లి చెడు తెచ్చుకోవడం ఎందుకు వారం రోజులుగా ఉంది మీరు చెప్పినట్టు అప్పుడే ఏర్పాట్లు చేస్తాము అని కౌసల్య అంటుంది. ఇక నేను బయలుదేరుతాను అమ్మ అని పంతులుగారు వెళ్ళిపోతారు. అరెరే ఇద్దరిలో సిగ్గులు మొగ్గలేస్తున్నాయి, వదిన గారు మా ఇంటికి బుల్లి మల్లి ని ఇస్తారా బుజ్జి గౌతమ్ ని ఇస్తారా అని నీలిమ అడుగుతుంది.ఏ అది భార్యాభర్తలకు సంబంధించిన విషయం నువ్వు ఆటపట్టించకు అని కౌసల్య అంటుంది. నా డిమాండ్స్ నాకు ఉంటాయి బ్రో నాకైతే బుజ్జి గౌతమి కావాలి అని నీలిమ అంటుంది. నాకైతే మల్లిలాంటి మహాలక్ష్మి కావాలి అని అంటుంది కౌసల్య. మొన్నటి వరకు గౌతమ్ నీ బాస్, ఇప్పుడు బాస్ కి భార్య అయిపోయావు నీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతుంది కౌశల్యం. అందరికీ నాలాంటి అదృష్టం దొరకదు కదా అని మల్లి చెప్తుంది. అమ్మ టైం అవుతుంది బయలుదేరుతాం అని గౌతమ్ అంటాడు.
స్వప్న జ్ఞాపకాల నుంచి ఇంత తొందరగా బయటపడతాడు అని నేను అనుకోలేదు, భగవంతుడా ఇద్దరిని చల్లగా చూడు స్వామి అని అనుకుంటుంది కౌసల్య. కట్ చేస్తే శరత్ వసుంధరిని పిలుస్తాడు. ఏంటి అని అడుగుతుంది వసుంధర. ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అడుగుతాడు.ఇంతకుముందు ఇప్పటికి కొంత స్పేస్ వచ్చింది, ఆ గ్యాప్ ని కొందరు బలవంతంగా ఆక్రమించుకున్నారు, అప్పటినుండి తమకు సేవలు చేసే మనుషులు మారిపోయారు, మీ పిలుపులు మారిపోయాయి అలాగే మీ ప్రియారిటిస్ కూడా మారిపోయాయి కదా, కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండుకొని తినే చేతులతో చేసిన చపాతీలు మీకు మధురం, అరపూట ఆకలితో అరపూట అంబలితో గడిపిన వారు చేసిన చింతపండు రసం మీకు అమృతం, కాపురంలో మంటలు పెట్టడానికి వచ్చిన వారు చేతి వంటలు తిని గాలి అటువైపు మళ్ళింది కదా అలాంటప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది వసుంధర. ఏంటి వసుంధర ఇది ఒక సంతోషం లేదు ఒక ఆనందం లేదు ప్రతి విషయాన్ని మల్లి మీరా కి ముడి పెడతావ్ ఎందుకు అని అంటాడు శరత్. మీకు ఫంక్షన్స్ కి షాపింగ్ లోకి ఆవిడ కావాలి సర్వీస్ చేయడానికి నేను కావాలా అని వసుంధర అనగానే శరత్ లేచి వెళ్ళిపోతాడు. అది చూసి మీరా, బాబు గారు నేను వడ్డిస్తాను రండి బాబు గారు అంటుంది మీరా. ఆకలిగా ఉంది అన్నారు కదా వడ్డిస్తాను రండి బాబు గారు. కడుపు నిండిపోయింది అంటాడు శరత్.
నా మాటలకు కడుపు నిండిపోయిందా లేక ఆవిడ గారు ఆప్యాయంగా పిలిచిన పిలుపుకి కడుపు నిండిపోయిందా అని అడుగుతుంది వసుంధర. నీ మాటలకే వసుంధర అని చెప్తాడు శరత్. నా మాటలు మీకు చేదుగా ఉంటాయని నాకు తెలుసు, మా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం మంచిది కాదు అని చెప్తున్నాను, హద్దులు దాటుతున్నావు అన్ని విషయాలలో ఉన్న అడుగు వెనక్కి పడుతుంది అనుకోకు నీ పని నువ్వు చూసుకో అని వసుంధర మీరాతో చెప్తుంది.అది కాదండి బాబు గారు ఆకలిగా ఉంది అన్నారు. నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంటుంది వసుంధర. తమరు రండి అని శరత్ ని పిలుస్తుంది వసుంధర. ఆయన మీకు ఒకరు వడ్డించేది ఏంటి మీరే వడ్డించుకొని తినండి అని చెప్తుంది వసుంధర.ఇలాంటి శిక్షలు ఎన్ని వేస్తావో వేయి భరిస్తూనే ఉంటాను అని వెళ్ళిపోతాడు శరత్.మీకు ఇలా జరిగితే కానీ బుద్ధి రాదని నాకు తెలుసు నువ్వు చాటు గా ఉండి చూస్తున్నావ్ అని నాకు తెలుసు మీరా అని అనుకుంటుంది వసుంధర. కట్ చేస్తే వసుంధర మాలిని కి ఫోన్ చేస్తుంది. మళ్లీ ఏం జరిగింది అని అడుగుతుంది మాలిని. మీరా తనంతట తాను బయటికి వెళ్లి పోయేలా కొత్తరకంగా స్కీమ్ మొదలుపెట్టాను, మనిషి మీద పడే దెబ్బ కంటే మనసు మీద పడే దెబ్బకి ఎక్కువ పెయిన్ ఉంటుంది కాబట్టి, మీర మనసుని మాటలతో పొడుస్తున్నాను, బయటకి పోయేవరకు పొడుస్తూనే ఉంటాను అని వసుంధర చెప్తుంది.
అలాగే చేయి నీ కాళ్ళ మీద పడి బయటికి వెళ్ళిపోతుంది అని మాలిని అంటుంది. మీ డాడీ ని నమ్ముకుంటే నా సమస్యకు పరిష్కారం దొరకదు మాలిని నా సమస్యకు నేనే పరిష్కారం చూసుకుంటాను సరే ఉంటాను మాలిని అని చెప్తుంది వసుంధర. ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే గౌతమ్ మల్లి ఇద్దరు ఆఫీస్ కి వస్తారు. నేను ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు నీ భవిష్యత్తును నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అరవింద్ తన మనసులో అనుకుంటాడు. అందరూ కలిసి కంగ్రాట్స్ చెప్తారు. అందరూ విషెస్ చెప్పారు తమరు చెప్పరా అరవింద్ గారు అని అంటాడు గౌతమ్. బాస్ అంటే బాస్ భార్య అంటే అందరికి రెస్పెక్ట్ ఉంది తమరికి లేదా. మీరేమైనా అనుకోండి ఈ అరవింద్ కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది దాంతోనే బతుకుతాను అంటాడు అరవింద్. ఇక నుంచి అందరు మల్లిని మేడం అని పిలవాలి, చనువు తీస్కొని మాట్లాడకూడదు, ఎవరి బైక్ పడితే వాళ్ళ బైక్ ఎక్కదు ఇప్పుడు మల్లి రేంజ్ మారింది అంటాడు గౌతమ్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!