Malli Nindu Jabili February 1 2024 Episode 561: గతంలో నీ ప్రేయసి చావుకి కారణమయ్యాడని చంపించావా లేదంటే నా అల్లుడు నీ పెళ్ళాం వెంట పడుతున్నాడని నెపంతో చంపించావా చెప్పరా ఎందుకు చంపించావు అని వసుంధర అంటుంది. అరవింద్ మీద నాకు కోపం ఉంది కానీ చంపేంత పగలేదు అర్థం చేసుకో అత్త అరవింద్ చనిపోవడం నాకేం సంతోషంగా లేదు చాలా బాధగా ఉంది అని గౌతమ్ అంటాడు. నిన్ను వీళ్ళందరూ నమ్మొచ్చు రా కానీ నేను మాత్రం నమ్మను అని వసుంధర అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ భగవంతుడు నమ్మితే చాలు నేరం చేసిన వాడు బయటికి రాకపోడు అని కౌసల్య అంటుంది. నేరం చేసిన వాని పక్కన పెట్టుకొని అందరు నాటకం ఆడుతున్నారా అని వసుంధర అంటుంది.మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే బాధ ఉంది అలా అని నోటికి వచ్చినటు మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు సిద్ధంగా లేరు అని మల్లి అంటుంది.
నీకే సంబంధం లేనప్పుడు శంకరమను మీ ఇంటికి ఎందుకు పిలిపించారు ఏం ఆశ చూపెట్టావు అని వసుంధర అంటుంది. సాక్షాలు ను డబ్బుతో కొని వంటి బుద్ధి మాకు లేదు అని కౌసల్య అంటుంది. పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు కదా కాస్త మౌనం వహించండి అని మల్లి అంటుంది. శంకరమని మీ ఇంటికి రప్పించుకోవడానికి వేరే ఉద్దేశం ఏదో ఉంది అని వసుంధర అంటుంది. నీకు అంత అనుమానం ఉంటే ఆవిడని అడుగక పోయావు అత్త ఆవిడ మీకు కానీ మాకు కానీ చుట్టం కాదు కదా ఆవిడ అబద్ధం చెప్పదు కదా అని గౌతమ్ అంటాడు. ఆమెని మీరు ఏ మాయ చేసారో అని వసుంధర అంటుంది. ఆవిడ నీ మాటలతో మాయ చేయడానికి పిలిపించలేదు అక్క భర్తను చంపిన వాడిని గుర్తు తెచ్చుకోమని చెప్పాను మా అక్క బ్రతుకుని అలా చేసిన వాడిని నేనే ముందు తెలుసుకోవాలనుకున్నాను మా అక్కను అలా చూడలేకపోతున్నాను అని మల్లి బాధపడుతుంది. మీరు ఎన్ని చెప్పినా వినే నేరస్తుని గా అనుమానిస్తున్నాను వీడి మీద కంప్లీట్ ఇస్తాను వీడే నేరస్థుడని నిరూపిస్తాను అని వసుంధర అంటుంది.
నువ్వు నేరం చేయలేదని ఆ దేవుడే నా నమ్మొచ్చు కానీ నేను నమ్మను మిమ్మల్ని అందరిని రోడ్డు మీదికి లాగుతాను అలా చేయకపోతే నా పేరే మార్చుకుంటాను ఇది నా చాలెంజ్ అని వసుంధర అంటుంది.ఇది వేరే విషయం అయితే మీతో నేను చాలెంజ్ చేసేదాన్ని కానీ మా అక్క బ్రతుకు మీరు ఇలా మాటిమాటికి వచ్చి నా భర్తను నిందించకండి ఇంకోసారి ఇలా రాకండి అరవింద్ బాబు గారిని చంపింది ఎవరో నేను తెలుసుకుంటాను అని మల్లి అంటుంది. ఈ గౌతమ్ ని జైలుకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను వీడి చేత చిప్పకూడి తినిపించే బాధ్యతని నేను తీసుకుంటాను సిద్ధంగా ఉండు రా నీ ఇంటికి ఏ క్షణానైనా పోలీసులు రావచ్చు అని వసుంధర కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏవండీ ఏం ఆలోచిస్తున్నారు అని మల్లి అంటుంది. అరవింద్ ని చంపాన నీ వసుంధర అత్త నన్ను అంటుంది నేను అరవింద్ కి ఫోన్ చేసి రమ్మన్నానా పోనీ అరవింద్ ను చంపిన స్పాట్లో నేనున్నానా వసుంధర అత్త నన్ను ఎందుకు పదేపదే నిందిస్తుంది అని గౌతమ్ అంటాడు. నా కుటుంబంతో సంతోషంగా ఉందాం అనుకున్నాను రేపటి నుంచి ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు వసుంధర అత్త నా మీద కేసు పెడితే నాకు ఎవరూ జాబ్ ఇవ్వరు ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టినందుకు ఇప్పుడు బాగా చూసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు నేను నీకు దూరమయ్యేలా ఉన్నాను అని గౌతమ్ బాధపడతాడు.
మన మధ్య ఈసారి దూరం రాకూడదు మనం చనిపోయేంతవరకు మన మధ్య దూరం రాకూడదు అని మల్లి అంటుంది. నువ్వు ఆశ పడుతున్న దానికి వసుంధర అత్త చేస్తున్న దానికి సంబంధమే లేదు నా మీద తనకు కలిగిన అనుమానం రావణకాష్టంల దహించేస్తుంది అందుకే ఆవిడ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంది అని గౌతమ్ అంటాడు. ఆవిడ అనుకున్నంత మాత్రాన నిజమైపోతుందా అని మల్లి అంటుంది. అమ్మ అన్నయ్య బాగా భయపడుతున్నాడు వెళ్లి ధైర్యం చెబుదాం పద అని నీలిమ అంటుంది.నువ్వు ఆలోచిస్తున్నది వేరు నేను ఆలోచిస్తున్నది వేరు నువ్వు కాసేపు మౌనంగా ఉండు అని కౌసల్య వాళ్ళ మాటలు గమనిస్తుంది. వసుంధర అత్తయ్య నామీద కేసు పెట్టకుండా ఉండదు అని గౌతమ్ అంటాడు. మీరు అలా ఆధ్వర్యం పడకండి మీకు ఏ కీడు కలగకుండా నేను చూసుకుంటాను మీకు మనశ్శాంతిని చేకూరుస్తాను అని మల్లి అంటుంది. గౌతమ్ మల్లి నీ దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని కొద్దిసేపు ప్రశాంతతని పొందుతాడు. కట్ చేస్తే, అడవిలో మృగరాజు లాగా న్యూస్ ఛానల్లో సింహం లాగా ఉండే నా కొడుకు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు నేరం చేశానని భయపడుతున్నాడా ఆ శంకరమ్మ చూసిన చూపుకి గౌతమ్ భయపడుతున్న తిరుకి అసలు సంబంధమే లేదు గౌతమ్ ఏదైనా చేశాడా మల్లి మీద ప్రేమతో అని కౌసల్య పరిపరి విధాల ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది.
ఇంతలో నీలిమ వచ్చి ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు అని కౌసల్య అంటుంది. నువ్వు ఈ మధ్య అన్నయ్య గురించి పట్టించుకోవడం లేదు ఏంటి అని నీలిమ అంటుంది. ఈ మధ్య కొత్తగా పెళ్ళాం మీద ప్రేమ పుట్టుకొచ్చింది కదా తను చూసుకుంటుందిలే అని కౌసల్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,శంకరమ్మ భోంచేసావా రా భోజనం చేద్దాం అని వసుంధర తీసుకువెళ్తుంది.ఏమైందమ్మా అని శంకరమ్మ అడుగుతుంది.అరవింద్ ని చంపింది గౌతమేనని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను కానీ నువ్వు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు అని వసుంధర అంటుంది. బాగా చీకట్లో చూశాను పైగా వర్షం పడుతుంది గౌతమ్ బాబు లాగే అనిపిస్తున్నాడు కానీ గుర్తుపట్టలేకపోతున్నాను కచ్చితంగా చూసి ఉంటే చెప్పే దాన్ని అమ్మ అని శంకరమ్మ అంటుంది. నువ్వు నాకు సహకరిస్తావా రేపు గౌతమ్ మీద కేసు పెడదామనుకుంటున్నాను నువ్వొచ్చి గౌతమ్ నే చూసానని చెప్పు అని వసుంధర అంటుంది. ఆ అబ్బాయిని నేను కచ్చితంగా చెప్పట్లేను కదా అమ్మ అలా చెప్తే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అనే శంకరమ్మ భయపడుతుంది.
ఒక్కసారి పోలీసు వాళ్ళ చేతిలో పడ్డాక తప్పించుకోవడం కుదురుతుందా నేను అలా చెప్పలేనమ్మ అని శంకరమ్మ అంటుంది. పోలీసులు విచారణ జరిపించిన తరువాత గౌతమ్ నేరం చేయలేదని తెలిస్తే వదిలేస్తారు అందులో భయపడాల్సిన పని లేదు అని వసుంధర అంటుంది. అందుకు నా మనసు అంగీకరించడం లేదమ్మా అని శంకరమ్మ అంటుంది. వాళ్ల మాటల్ని పక్కనుంచి వింటున్నా మీరా షాక్ అవుతుంది. అతని మీద డౌట్ ఉందని చెప్పు అంత పెద్ద ప్రాబ్లం ఏమి కాదు అని వసుంధర అంటుంది. శంకరమ్మని ఎలాగైనా ఒప్పించాలని చూస్తుంది వసుంధర ఒప్పుకోవద్దమ్మా అని మీరా అనుకుంటుంది. ఆ అబ్బాయి కూడా మీ బంధువే కదా మరొకసారి ఆలోచించండి అమ్మ అని శంకరమ్మ అంటుంది. నేను నిజాన్ని తవడం మొదలుపెట్టాను అది ఎంతవరకు వెళ్ళినా తవ్వుకుంటూ వెళ్తాను ఇప్పుడే వస్తాను ఉండు అంటూ వసుంధర వెళుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!