Mamagaru October 30 Episode 43:ఒరేయ్ మై డియర్ పుత్రులారా మనం ఆడవాళ్ళ కాళ్ళ పట్టీల సౌండ్ కి భయపడ కూడదు, లొంగి పోకూడదు అలాగే, ఆడవాళ్లు సెంటు లాంటి వాళ్లు రా సెంటు సువాసనను ఆస్వాదించాలి తప్ప ఆ సెంటుకు బలహీనులైపోతే ప్రమాదం రోయ్ అంటాడు చెంగయ్య.మనం గట్టిగా ఉండాలి, లేదంటే స్త్రీలకి మనం బలం ఇచ్చిన వాళ్ళం అవుతాము,అప్పుడు వాళ్లు ఉద్యమాలు తిరుగుబాట్లు అంటూ,మనపై దాడికి సిద్ధమవుతారు.అర్థమైందా మై డియర్ సన్స్ అని అంటాడు చంగయ్య.
కొడుకులు అర్థమైంది నాన్న, అది…అలా ఉండాలి నాకు తెలుసు రా మీరు నా బంగారు కొండలని,నా మాట వింటారని. నేను లక్ష రూపాయలు అదనంగా సంపాదించమని అన్నందుకే కదా, మీ పెళ్ళాలు ఉద్యోగాలు చేయాలని మీకు ఈ ఆలోచన కలిగింది అంటాడు చెంగయ్య. అందుకు కొడుకులు ఏమి సమాధానం ఇవ్వకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. అయితే వినండి ఆ అదనంగా లక్ష రూపాయలు ఏం సంపాదించక్కర్లేదు, ఓకే అంటాడు చెంగయ్య. నలుగురు కొడుకులు షాకుతో, అవునా నాన్నగారు అంటారు.అవున్రా ఇక మీరు ఆ లక్ష రూపాయలు అదనంగా సంపాదించడం అవసరం లేదు గుర్తుందిగా మై డియర్ సన్స్ నేనేం చెప్పాను, ఇక యుద్ధానికి సిద్ధం అవ్వండి. కొడుకులను రెచ్చ గొట్టి వెళ్తాడు, కొడుకులు అలాగే నాన్నగారు అని అంటూ ఇంట్లోకి వెళుతూ ఉంటారు.
ఇంతలో చెంగయ్య ఇంట్లోకి వస్తుండగా తన భార్య దేవమ్మ,తన కూతురు,ముగ్గురు కోడలు, కలిసి అన్నం తినడానికి సిద్ధమవుతారు, వాళ్ళని చూస్తూ వెళ్లి అలాగే కుర్చీలో కూర్చుంటాడు చంగయ్య. అది చూసిన పెద్ద కోడలు వసంత అత్తగారు ఈ ఇంట్లో ఒక పద్ధతి అంటూ ఉందంట కదా, ముందుగా ఆడవాళ్లు తినకూడదంట కదా, మగవాళ్లు తిన్నాకే తర్వాత ఆడవాళ్లు తినాలంట కదా, అని వసంత అత్తగారిని అడుగుతుంది. అందుకు వసంత అత్త దేవమ్మా అదంతా ఆడవాళ్ళని గౌరవిస్తేనే నమ్మ లేదంటే ఏదీ ఉండదు, అని నవ్వుతూ సమాధానం చెబుతుంది.
చంగయ్య తన భార్య దేవమ్మ కూడా కోడళ్ళ వైపు మాట్లాడుతుంది అనుకుని ఏం మాట్లాడాలో, తెలియకుండా అలాగే కుర్చీలో కూర్చుంటాడు.మూడవ కోడలు గంగ, అత్తయ్య మీరే మా లీడర్ అంటూ పొగుడుతుంది. అందుకు దేవమ్మ నవ్వుతూ ఉండగా, గంగ అవును అత్తయ్య ఈ ఇంటికి మీరే బిగ్ బాస్ అంటుంది.అత్తయ్య మీకు ఏం కావాలి అని అడుగుతుంది, అందుకు దేవమ్మ, తన భర్త చంగయ్య వైపు చూస్తూ, నాకు కొంచెం గౌరవం మర్యాద కావాలమ్మా అని నవ్వుతూ అడుగుతుంది.అయినా ఈ ఇంట్లో మనం చీపుర్లతో సమానం కదా అత్తయ్య అంటుంది గంగ. ఇంతలో రెండవ కోడలు లక్ష్మి అబ్బా అత్తయ్య ఈరోజు వంటలు అదిరిపోయాయి, నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా పెట్టండి అత్తయ్య అంటుంది లక్ష్మి. వెంటనే గంగా ఆడవాళ్ళ గౌరవం వర్ధిల్లాలి అనగానే, తన అత్త దేవమ్మ గంగ,తోటి కోడళ్ళు వసంత, లక్ష్మి, తన ఆడపడుచు కూడా వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ నవ్వుతూ ఉంటారు
.
ఇక అందరూ కలిసి అన్నం తింటూ ఉండగా, ఇంతలో కొడుకులు కూడా భోజనానికి వస్తారు, తమకంటే ముందుగానే తింటున్న వాళ్లని చూస్తూ షాకుతో ఆగిపోతారు. చెంగయ్య రెండవ కొడుకు పాండురంగ, లక్ష్మి అంటూ కోపంగా పిలుస్తాడు.పెద్ద కొడుకు సుధాకర్ కూడా వసంత అంటూ పిలుస్తాడు. మూడవ కొడుకు గంగాధర్ గంగా అని పిలుస్తాడు.నాలుగవ కొడుకు శ్రీకాంత్ అమ్మ అని దేవమ్మ ని పిలుస్తాడు. అలా పిలిచి కోపంతో పాండురంగ ఈ ఇంట్లో మగవాళ్లు తిన్నాకే ఆడవాళ్లు తినాలని రూల్ ఒకటి ఉంది కదా, అంటాడు పాండురంగ. అందుకు లక్ష్మి వసంతతో,అక్క ఆ రూల్స్ ని రోల్ చేసి రోట్లో వేసి దంచి పడేసామని చెప్పు అక్క అంటుంది. గంగ ఆడవాళ్ళ గౌరవం వర్ధిల్లాలి అని అంటూ మళ్ళీ జై కొడుతుంది. అందుకు మిగతా ఆడ వాళ్ళందరూ కూడా జై కొడతారు. అప్పుడు ఇక ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఆ నలుగురు కొడుకులు నిలుచుండిపోతారు.తరువాత పెద్ద కొడుకు సుధాకర్ ఆహా అనగానే పెద్ద కోడలు వసంత ఆహా అంటుంది. ఇక రెండవ కొడుకు పాండురంగ ఓహో అనగానే రెండవ కోడలు లక్ష్మీ ఓహో అంటుంది.ఇక మూడవ కొడుకు గంగాధర్ అంతదాకా వచ్చిందా అనగానే మూడవ కోడలు గంగ ఎంత దాకైనా వెళ్తుంది అని అంటుంది. అందుకు గంగాధర్ ఉద్యమం మొదలైందా అంటాడు,అందుకు గంగా ఉద్యమం కాదు తిరుగుబాటే మొదలైంది అంటుంది గంగ.
అయితే మాకు వండలేదా అంటాడు చిన్న కొడుకు శ్రీకాంత్ అందుకు దేవమ్మ లేదు అంటుంది.అందుకు నలుగురు కొడుకులు షాక్ అయి,అందులో పెద్ద కొడుకు సుధాకర్ ఒరేయ్ వెధవల్లారా జై కొట్టండి రా మనం కూడా మగాళ్ళం కదా అంటాడు సుధాకర్.అందుకు ముగ్గురు తమ్ముళ్లు మగవాళ్ళ గౌరవం వర్ధిల్లాలి మగవాళ్ళు జిందాబాద్ అని జై కొడుతూ ఉంటారు. గంగా అవును అత్తయ్య వీళ్ళు మన పార్టీ కదా పార్టీ ఎప్పుడు మార్చారు ఈ మగవాళ్ళు అని అంటుంది. దేవమ్మ.మీ మామ ఎంత తెలివిగల వాడినైనా ఇట్టే మార్చేస్తాడు. మీ మామ గురించి నీకు సరిగ్గా తెలియదు అసాధ్యుడు అంటుంది దేవమ్మ.రెండవ తమ్ముడు పాండురంగ ఆ అన్నయ్య ఇప్పుడు కడుపు లో బాధకి తిరుగుబాటు అవసరమా అంటాడు. ఆపరా మనం మన వంట మనం చేసుకుందాం అని అంటాడు సుధాకర్.
పాండురంగ అయితే ఏం చేద్దాం అన్నయ్య,బయటికి వెళ్లి తిందామా అంటాడు,కాదురా మన వంట మనమే వండుకుందాం, నలభీమ పాకం వండుకొని తిందాం అంటాడు.సుధాకర్ అందుకు పాండురంగ అదేమి వంట అన్నయ్య పాయసమా అన్నమా కూర అంటాడు. కాదురా అంటాడు సుధాకర్. కొంచెం మనం ఎవరం సన్స్ ఆఫ్ చంగయ్య, పట్టుదలకి ప్రతిరూపాలం అంటూ పదండిరా అంటూ తమ్ముళ్ళను తీసుకొని వంట గదిలోకి వెళ్తాడు సుధాకర్.గదిలోకి వెళ్ళాక పాండురంగ అన్నయ్య,వంట ఎలా చేయాలి అన్నయ్య అని అడుగుతాడు అందుకు సుధాకర్ ఒరేయ్ ముందు బియ్యం నానబెట్టుకోవాలి తర్వాత ఎసెట్లో నీళ్లు పోసి అవి వేడెక్కాయో లేవో చూసుకోవాలని అంటూ చెయ్యి నీళ్లలో పెడతాడు చెయ్యి కాలిపోతుంది అందుకు పాండురంగ. ఓహో అన్నయ్య ఎసెట్లో నీళ్లు వేడెక్కాయో లేదో చూడ్డానికి చెయ్యి పెట్టి చూడాలా అని అంటాడు. అందుకు సుధాకర్ కాదురా చెయ్యి కాలిపోయింది అని, చెయ్యి ని ఊదుకుంటూ ఉంటాడు. పాండురంగ అన్నయ్య మనము అన్నము, కూర, పప్పు, సాంబార్, మజ్జిగ,ఇవన్నీ చెయ్యాలా అని అంటాడు. అందుకు సుధాకర్ ఒరేయ్ మనం తినడానికి బతక కూడదురా, బ్రతకడానికి మాత్రమే తినాలి అని చెబుతాడు సుధాకర్. అందుకు పాండురంగ అవునా అన్నయ్య ఎవరు చెప్పారు, ఎవరో పెద్ద వాళ్ళు చెప్పారు రా నీతి సూక్తులు,మనం అవన్నీ చేయలేం కానీ ఒక అన్నం సాంబార్ మాత్రం చేద్దాం.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!