టాలీవుడ్ కింగ్ నాగార్జున తన పొలిటికల్ ఎంట్రీ పై ఓపెన్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచి నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారని, విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు.
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ.. `నేను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఎలక్షన్ల సమయంలో ప్రతి సారి ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. కానీ మంచి కథ దొరికితే మాత్రం పొలిటికల్ లీడర్గా చేయడానికి సిద్ధం` అంటూ నాగార్జున పేర్కొన్నారు.
దీంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. నాగార్జున త్వరలోనే `ది ఘోస్ట్` మూవీ తో ప్రేక్షకులను పలకరించిబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
https://newsorbit.com/cinema/nagarjuna-target-on-ghost-movie.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!