Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. జనవరి 8వ తారీకు ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. విడుదలైన “గుంటూరు కారం” ట్రైలర్ లో మహేష్ మాస్ పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారు. నోట్లో బీడీ పెట్టుకుని మహేష్ చెబుతున్న మాస్ డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం వంటి నటీనటులు కీలకపాత్రలో కనిపించారు. తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో..ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్.. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతం యూట్యూబ్ లో “గుంటూరు కారం” ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే “గుంటూరు కారం” సినిమా కి సంబంధించి నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద మహేష్ బాబు భారీ కటౌట్ పోస్ట్ చేసి.. జనవరి 12వ తారీకు సినిమా చూడటానికి కుటుంబ సమేతంగా సుదర్శన్ థియేటర్ కి వస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ పట్ల భారీగా రియాక్ట్ అవుతున్నారు. ఎలాగైనా ఆ రోజు తమ అభిమాన హీరోని కలవాలని అతనితోపాటు సినిమా చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంత డబ్బు అయినా టికెట్ కొనాలని ఆశిస్తున్నారు. మహేష్ బాబుకి సుదర్శన్ థియేటర్ చాలా సెంటిమెంట్. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో కూడా చెప్పారు. ఇప్పుడు అదే థియేటర్ కి గుంటూరు కారం చూడటానికి మహేష్ ఫ్యామిలీ అంతా కలిసి రావడానికి సిద్ధపడటం విశేషం. జనవరి 12వ తారీకు సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ మహేష్ కలయికలో వస్తున్న మూడు సినిమా కావటంతో ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!