Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఇది 107 ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని పట్టాలెక్కించారు. ఇందులో శుత్రి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. దునియా విజయ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన పార్ట్ను కూడా త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్తో త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తండ్రీకూతుళ్ల మధ్య సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల మెరవబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట.
సెప్టెంబర్లో షూటింగ్ను స్టార్ట్ చేసి.. మూడంటే మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఓ నెల పోస్ట్ ప్రొడెక్షన్ పనులు మరియు ఇతర పనులను పూర్తి చేసి.. వెంటనే ప్రమోషన్స్ షురూ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమై ఎన్బీకే 108 వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయితే బాలయ్య ఫ్యాన్స్కి పండగే అవుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!