Nindu Noorella Saavasam January 16 2024 Episode 134: అమ్మగారు చూశారాడబ్బులు కోడలుకు ఇచ్చే వారంట ఇప్పుడు కాబోయే కోడలుకు ఇస్తున్నారేమో అందుకే మిస్సమ్మకి డబ్బులు ఇచ్చారు వాళ్ళ మనసులో ఏముందో తెలిసిందా అని నీలా అంటుంది.వాళ్ళ ప్లాన్ వాళ్లకు ఉంటే నాకు ఉండాల్సిన ప్లాన్ నాకు ఉన్నాయి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కొట్టడం అంటే ఏంటో నీకు తెలుసా నీలా ఇప్పుడు చూడు ఆ డబ్బు కొట్టేసి భాగమతిని ఇరికిస్తాను ఇటు రౌడీని బయటికి పంపించేస్తాను దీనితో నాకు టెన్షన్ తీరిపోతుంది అని మనోహరి అంటుంది. ఏమో నమ్మ నా మట్టి బుర్రకు ఏమీ అర్థం కావట్లేదు మీరేం చేస్తారో ఏమో అని నీలా అంటుంది.కట్ చేస్తే,భాగమతి నిర్మల దగ్గరికి వెళ్లి ఆంటీ అంకుల్ డబ్బులు ఇచ్చి రమ్మన్నాడు అని డబ్బులు ఇస్తుంది.
ఈ డబ్బులు ప్రతి సంవత్సరం మి అంకుల్ మా కోడలికి ఇచ్చేవాడమ్మా ఇప్పుడు మా మధ్యన తను లేదు అని నిర్మల ఏడుస్తుంది. ఆంటీ ఊరుకొండ ఆంటీ అందరూ తనని మెచ్చుకున్న వారే కానీ ఎవరు తిట్టిన వారే లేరు అంత మంచి ఆవిడను దేవుడు ఎందుకు ఇలా అప్పుడే దూరం చేసి నీకు అన్యాయం చేశాడు అని భాగమతి అంటుంది. తను ఎంత మంచిది అంటే మాటల్లో చెప్పలే మామ మాకు కూతురుతో సమానం మా ఇల్లును చీకటి చేసి ఆ దేవుడు మా కోడల్ని తీసుకువెళ్లిపోయాడు ఆ బాధలో నుంచి బయటపడడానికి మా వల్ల కావట్లేదు అని నిర్మల అంటుంది. బాధపడకండి ఆంటీ అంత మంచి ఆవిడను నేను ఒకసారి చూడొచ్చా అని భాగమతి అంటుంది.అయ్యో మిస్సమ్మ ఇప్పుడు నన్ను చూసేస్తుందా ఫోటో అడుగుతుంది ఏంటి అని అరుంధతి అనుకుంటుంది. అదేంటమ్మా నువ్వు ఇంతవరకు మా కోడలు ఫోటో చూడలేదా చూపిస్తాను ఉండు అని నిర్మల ఫోటోలు వెతుకుతుంది కానీ ఒక్క ఫోటో కూడా దొరకకపోవడంతో అమర్ దగ్గర ఉంటుంది వెళ్లి అడిగి చూడు చూపిస్తాడు అని నిర్మల చెప్తుంది. ఆయననా ఫోటో చూపించమంటే 100 క్వశ్చన్స్ వేసి సమాధానం చెప్తేనే ఫోటో చూపిస్తాను. అంటాడు ఆయనను అడిగాడం కన్నా ఊరుకోవడం బెటర్ ఆంటీ మీ దగ్గర ఏ చిన్న ఫోటో అయినా లేదా అని భాగమతి అంటుంది.
పెళ్లి ఫోటో ఉండాలి చూస్తాను ఉండమ్మా అని నిర్మల అంతా వెతుకుతుంది కానీ ఫోటో కనిపించదు.హమ్మయ్య అత్తయ్యకి ఫోటో కూడా దొరకలేదు బ్రతికిపోయాను అనిఅరుంధతి అనుకుంటుంది.పర్వాలేదులే ఆంటీ ఇంకెప్పుడైనా చూస్తానులే అని భాగమతి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,ఏంటి అంజలి నువ్వే నా చదివేది నువ్వు ఎంత చదివినా నీకు గుర్తుండదు కదా అని పిల్లలు ముగ్గురు ఎగతాళి చేసి నవ్వుతూ ఉంటారు. అవును నేను ఎంత చదివినా గుర్తుండదు అందుకనే ఎక్కువ సేపు చదివితే కాస్తఅయిన నాకు గుర్తుకుంటుందని చదువుతున్నాను కానీ అమ్మ ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నాన్నతో చెప్పిందికానీ ఇప్పుడు అమ్మ లేదుగా అని అంజలి బాధపడుతుంది. అవును అంజలి ఇప్పుడు కూడా మీ నాన్నకు ఆ విషయం తెలిసేలా చేస్తాను ఊరుకో మా బాధపడకు అని అరుంధతి అంటుంది. ఇంతలో భాగమతి వచ్చి అరుంధతిని చూసి హాయ్ అక్క అని అంటుంది.ఎప్పుడు వచ్చారు మీరు అని భాగమతి అంటుంది.
ఇప్పుడు మాట్లాడి ఇబ్బంది పారిపోతే ఎందుకు పారిపోతున్నావు అంటుంది ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడే మౌనంగా చూస్తుంది అరుంధతి. మిస్సమ్మ ఏంటి నన్ను మీరు అంటుంది అని అంజలి అనుకుంటుంది. పిల్లలు బాగా చదువుకుంటున్నారా నేను లేకపోయేసరికి చదవరేమో అనుకున్నాను ఆంటీ పక్కన ఉన్నందుకు బాగా చదువుకుంటున్నారు థాంక్స్ అక్క అని భాగమతి అంటుంది. మిస్సమ్మ నిన్ను కూడా డాక్టర్ కి చూపించాల్సిందేఉన్నట్టుండి ఏవేవో మాట్లాడతావు అని అంజలి అంటుంది. ఏంటక్కా మాట్లాడవు అని భాగమతి అంటుంది. నువ్వు మాట్లాడేది మనిషితో కాదు ఆత్మ అని తెలిస్తే ఏమైపోతావు అని అరుంధతి అనుకుంటుంది.మిస్సమ్మ నేను వెళ్ళిపోతున్నాను పిల్లలు పడుకునే టైం అయింది అని అరుంధతి వెళ్ళిపోతుంది.ఏంటి అంజలి ఏమో అంటున్నావ్ అని భాగమతి అడుగుతుంది.ఇద్దరిద్దరే అని పిల్లలు ముగ్గురు నవ్వుకుంటారు.అంజలి నువ్వు బాగా చదువుకో అమ్మాకావాలంటే నేను ఇక్కడే ఉంటాను భయపడకు అని భాగమతి అంటుంది.
కట్ చేస్తే, నీలా అందరూ పడుకున్నారా లేదో చూడవే అని మనోహరి అంటుంది.అమ్మ అందరూ పడుకున్నారు కానీ భయమేస్తుంది అమ్మ ఎందుకో ఏమో జైలుకు వెళ్దాం అనిపిస్తుంది అని నీలా భయపడుతుంది.ఎక్కువ మాట్లాడావంటే నేనే చంపేస్తాను వెళ్లి తీసుకురా పో డబ్బులు అని మనోహరి బెదిరిస్తుంది.మీరు కూడా రండి అమ్మ తోడుగా ఉంటారు ఎవరైనా వస్తే దొరికిపోను అని నీలా అంటుంది.నీలా మనోహరి కలిసి నిర్మల గదిలోకి వెళ్లిచూస్తారు,ఆంటీ పడుకుంది తాళం తీసి డబ్బులు తీసుకురా అని మనోహరి అంటుంది. డబ్బులకు కకృతి పడి రెండు జీతాలకు పనిచేయాల్సి ఉంటుంది ఈవిడతో ఉంటే కచ్చితంగా నేను జైలు పాలు అవుతాను అని నీలా భయపడుతూ తాళం తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ తాళం తీయలేక భయపడి పోయి వచ్చి అమ్మగారు నావల్ల కావట్లేదు మీరు తీయండి నేను ఇక్కడ ఎవరు రాకుండా చూసుకుంటాను అని నీలా అంటుంది.
మనోహరి వెళ్లి తాళం తీయడానికి ప్రయత్నిస్తుంది. మనోహరి తాళం తీస్తూ ఉండగా నిర్మల అటు ఇటు ఒకసారి కదులుతుంది శివరామ్ కూడా దగ్గినట్టు చేస్తాడు దానితో భయపడిపోయి మనోహరి దాక్కుంటుంది. కచ్చితంగా ఈవిడ దగ్గర ఉంటే నేను జైలుకు వెళ్లాల్సిందే చిప్పకూడు తినాల్సిందే ఏం చేయాలి ఈవిడ దగ్గర నుంచి పని మానేయాలి లేదంటే ఈరోజు తప్పకుండా దొరికిపోతాము అని నీలా టెన్షన్ పడుతుంది. ఒక్క రెండు నిమిషాలు ఆగితే పని అయిపోతుంది అని మనోహరి టెన్షన్ పడుతుంది.వాళ్లు పడుకోగానే మళ్లీ తాళం తీయడానికి మెల్లగా మంచం దగ్గరికి వెళ్లి నిర్మల మెత్త కింద చెయ్యి పెట్టి తాళం తీస్తుంది మనోహరి. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?