Nindu Noorella Saavasam November 30 2023 Episode 94: డాడీ తో నువ్వు చెప్పురా నాకు భయమేస్తుంది అని ఆనంద్ అంటాడు. అమ్మో నేనా డాడీని అడగలేను అని ఆకాష్ అంటాడు. ఇంతలో శివరామ్ వచ్చి ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు మీ డాడీ తో ఏమైనా చెప్పాలా అని అంటాడు. అదేమీ లేదు తాతయ్య అని పిల్లలు ముగ్గురు అంటారు. మీరు ముగ్గురు ఒకేసారి అన్నారు అంటే ఏదో ఉంది చెప్పండి అని శివరామ్ అంటాడు. నాతో ఏమైనా మాట్లాడాలా చెప్పండి అని అమరేంద్ర అంటాడు. డాడీ మీకు చెప్పకుండా ఒక అతన్ని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాము అని అమృత అంటుంది. అంజు కి ఒంట్లో బాగోలేదు పరిస్థితులు కూడా ఏమీ బాగోలేవు ఇప్పుడు వద్దులే ఇంకెప్పుడైనా పిలుద్దాము అని అమరేంద్ర అంటాడు. మన పరిస్థితులు బాగోలేదని ఇంటికి పిలిచిన అతిధిని రావద్దని చెప్తామా ఏం పర్వాలేదు రమ్మనండి అని భాగమతి అంటుంది. అవున్రా అమర్ ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే పిల్లల్ని ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అలాంటి వాడిని ఇంటికి పిలిచి కాస్తంత భోజనం పెడితే ఏం పోతుంది రమ్మని చెప్పరా అని శివరామ్ అంటాడు.
సరే రమ్మనండి కానీ ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయకండి అని అమరేంద్ర అంటాడు. మనోహరి ఏదో చెబుదామని అనుకుంటుంది. కానీ నీలా ఆగమ్మ గారు అసలే బ్యాడ్ టైం నడుస్తుంది మీరేదో అంటారు సార్ కోప్పడతారు అవసరం అంటావా అని నీలా అంటుంది. రాథోడ్ ఆయన అడ్రస్ ఎక్కడ ఉందో తెలుసుకొని తీసుకురా అని అమరేంద్ర అంటాడు. అలాగే సార్ అని రాథోడ్ అంటాడు. కట్ చేస్తే, ఇందాక అన్నదానికి అమ్మగారు బాగా ఫీలయినట్టున్నారు వెళ్లి కూల్ గా మాట్లాడదాం అని నీలా అమ్మగారు సారీ అని అంటుంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది నీలా నేను అమర్ కి ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా సరే కాలేకపోతున్నాను, దానికి తోడు భూత వైద్యుడు నిన్నటి కానుంచి మన ఇంటి చుట్టూ ఆత్మ ఉందని తిరుగుతూ ఉన్నాడు, అతను ఒక్కడే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పగలడు అతను ఎక్కడ ఉంటాడో తెలుసుకుని రా అని మనోహరి అంటుంది. అమ్మగారు దశదిశకర్మ అయిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో కలుస్తుందని అంటారు అతను చెప్పింది అబద్ధమేమో అమ్మ అని నీలా అంటుంది. లేదే అతను నాకు కావాలి నువ్వు వెళ్లి పిలుచుకురా అని మనోహరి అంటుంది. అయ్యో మను ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు ఆ భూత వైద్యుడు వస్తే నన్ను బంధించి తీసుకువెళ్తాడు అని అరుంధతి అంటుంది.
నీలా ఆ భూత వైద్యుడు దగ్గరికి వెళ్తూ ఉండగా, అరుంధతి గుప్తా గారి దగ్గరికి వచ్చి గుప్తా గారు భూత వైద్యుడు దగ్గరికి వెళుతుంది నీలా తనను ఆపండి అని అంటుంది. నేను ఏమీ చేయలేను బాలిక నా ఉంగరము ఇచ్చినచో మనము యమలోకానికి పోయేదము లేదన్నచో నీవు ఇక్కడ ఉండి నరకం అనుభవించెదవు అని గుప్త అంటాడు. ఏదో ఒకటి చేయండి ముందు నీలాని ఆపండి అని అరుంధతి అంటుంది. బాలిక ఎక్కడికి వెళ్తున్నావు అని గుప్తా అంటాడు. బయటికి వెళ్లేటప్పుడు చెప్పకూడదండి మీకు తెలియదా అని నిలా అంటుంది. నాకు కూడా చెప్ప వలదా అని గుప్తా అంటాడు. నా విషయమైతే చెప్పేదాన్ని కానీ మా అమ్మగారి విషయంలో బయటకు వెళ్తున్నాను అని నీలా వెళ్ళిపోతుంది. పోతే పోయినావు గాని ఆ మాంత్రికుడి కంట పడకు బాలిక అతను పెళ్లి కానీ ఆడవాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాడు అని గుప్తా అంటాడు. అవునా అతను ఆత్మల కోసం తిరుగుతున్నాడు అనుకుంటా అని నీలా అంటుంది. పైకి అలాగే చెప్తారు కానీ వాళ్లు నీలాంటి పెళ్లి కాని వాళ్ళ కోసమే వెతుకుతూ ఉన్నాడు అని గుప్తా అంటాడు. చాలా థాంక్స్ అండి నన్ను బయటికి వెళ్ళనీయకుండా చెప్పినందుకు బాయ్ అంటూ నీలా వెళ్ళిపోతుంది.
చాలా థాంక్స్ గుప్తా గారు నీలాని బయటికి వెళ్లకుండా చేసినందుకు అని అరుంధతి అంటుంది. చూడు బాలిక ఇలా ఎన్ని రోజులని దాక్కుంటావు నా ఉంగరము నాకియి మనము యమలోకానికి పోదాము అని గుప్తా అంటాడు. నా దగ్గర ఆ ఉంగరం లేదు గుప్తా గారు అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, రామ్మూర్తి అమరేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు.మీ బావగారు కొత్త షర్టు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం పదరా తమ్ముడు అని మంగళ వెళుతుంది. వాళ్ళు వచ్చే లోపు కారేకి రామ్మూర్తి వెళ్ళిపోతాడు. కొంచెం ముందు వస్తే మీ బావ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసేది రా అని మంగళ అంటుంది. అక్క బావ గురించి ఆలోచించడం కంటే మనకు పనికొచ్చే విషయం గురించి ఆలోచిద్దామా అని వాళ్ళ తమ్ముడు అంటాడు.
అవున్రా ఆ మిల్ట్రీ అయిన వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసుకుని రా మనకు ఎవరైనా పనికొస్తారేమో తెలుస్తుంది అని మంగళ అంటుంది. కట్ చేస్తే, భాగమతి వంటలన్నివ్వండి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అమ్మగారు ఆ భూత వైద్యుడు చుట్టుపక్కల ఎక్కడా లేడు అని నీలా చెప్తుంది. అతని ఎలాగైనా నాకు కావాలి మీ వాళ్ళతో చెప్పి వెతికించు అని మనోహరి అంటుంది. ఏంటమ్మా ఏమి వంటలు చేశావు అని పిల్లలు అడుగుతారు. అక్కడ ఉన్న వంటలు చూసి మిస్సమ్మ ఇవన్నీ మా తాతయ్యకు ఇష్టమైనవే చాలా థాంక్స్ మిస్సమ్మ అని అమృత అంటుంది.
అవునా ఈ వంటలన్నీ మా నాన్న కూడా చాలా ఇష్టం అని భాగమతి అంటుంది. మేము నీ గురించి తాతయ్యతో చెప్పితే నా కూతురు కూడా ఇలాగే ఉంటుంది అని చెప్తాడు మిస్సమ్మ అని ఆనంద్ అంటాడు. ఇంతలో రాథోడ్ రామ్మూర్తిని తీసుకొని వస్తాడు. అదిగో మీ తాతయ్య వచ్చినట్టున్నాడు పిల్లలు అని శివరామ్ అంటాడు. పిల్లలందరూ తాతయ్య వచ్చాడని పరిగెడతారు. భాగమతి కూడా చూద్దామని వెళుతుంది, కానీ మనోహరి అడ్డుపడి నీవు ఎక్కడికి ఇంట్లో పనులు చూసుకో వెళ్ళు అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!