నాగచైతన్యతో విడిపోయిన అనంతరం తన ఫోకస్ మొత్తాన్ని కెరీర్ పైనే మల్లించిన సమంత.. వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో `యశోద` ఒకటి. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి–హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. హై బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
కానీ, సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోయారు. ఇక సెప్టెంబర్ లో అయినా ఈ సినిమా విడుదల అవుతుందని భావించారు. అయితే ఇప్పుడు వరకు అలాంటి అప్డేట్ ఏమీ రాలేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ లో కూడా యశోద రావడం కష్టమే అంటున్నారు.
మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన `శాకుంతలం` పరిస్థితి కూడా ఇలానే ఉంది. షూటింగ్స్ పూర్తైనా ఈ రెండు చిత్రాలు విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. అసలు విడుదలను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో కూడా అర్థం కాకపోవడంతో.. సమంత అభిమానులు తీవ్ర అయోమయంలో పడిపోయారు. మరి ఇప్పటికైనా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ వస్తుందో..లేదో..చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!