Khakee: The Bihar Chapter: ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక బయోపిక్ షోలు, సినిమాలు ఎక్కువవుతున్నాయి. చరిత్రలో మంచి చేసిన వారితో పాటు బాగా చెడు చేసిన వీరప్ప లాంటి వారి కథలను కూడా కొందరు డైరెక్టర్లు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. స్కామ్:1992 ద్వారా హర్షద్ మెహతా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో కూడా చూపించారు. కాగా తాజాగా నెట్ఫిక్స్లో ఓ గ్యాంగ్స్టర్ జీవిత కథ ఆధారంగా ఒక డ్రామా సిరీస్ రిలీజ్ అయింది. ఖాకీ: ది బీహార్ చాప్టర్ పేరుతో నవంబర్ 25, 2022న నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ 7-ఎపిసోడ్ సిరీస్ చాలామందిని ఆకట్టుకుంటోంది.
ఐపీఎస్ అధికారి అమిత్ లోధా రాసిన బిహార్ డైరీస్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను భావ్ ధులియా రూపొందించారు. ఈ సీరిస్లో 2000 కాలంలో బిహార్లోని అత్యంత భయంకరమైన నేరస్థులలో ఒకరైన చందన్ మహ్తోను IPS అధికారి అమిత్ లోధా ఎలా వెంబడించి పట్టుకున్నారనే దానిని చక్కగా చూపించారు. ఈ సిరీస్లో చందన్ మహ్తో క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇంతకీ ఆ డేంజరస్ క్రిమినల్ ఎవరు?
Khakee: The Bihar Chapter: చందన్ మహ్తో ఎవరు?
చందన్ మహ్తో అనే క్యారెక్టర్ను రియల్ లైఫ్ పింటూ మహ్తో అనే గ్యాంగ్స్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ పింటూ మోస్ట్ డెడ్లియస్ట్ గ్యాంగ్ అయిన అశోక్ మహ్తో గ్యాంగ్లో కీలకమైనవాడు. ఈ క్రిమినల్ గ్యాంగ్ 2000ల ప్రారంభంలో బిహార్లో యాక్టివ్గా ఉండి ఎన్నో అరాచకాలకు పాల్పడింది. 2005లో కాంగ్రెస్ ఎంపీ రాజో సింగ్ హత్యలో ఈ గ్యాంగ్ హస్తం ఉంది. పింటూకి రాజో సింగ్ హత్యతో పాటు పలు హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలానే డిసెంబరు 23, 2001న నవాడా జైలు నుంచి పారిపోయాడు. ముప్పై హత్య, అపహరణ కేసుల్లో పింటూ వాంటెడ్గా ఉన్నాడు. ఈ గ్యాంగ్స్టర్, తన సహచరులతో కలిసి ఇద్దరు పోలీసులను చంపి తప్పించుకున్నాడు.
అశోక్ మహ్తో గ్యాంగ్ బిహార్లో 1998-2006 మధ్య కాలంలో అఖిలేష్ సింగ్ అనే మరో గ్యాంగ్తో పోటీ పడింది. వీరి మధ్య శత్రుత్వం వల్ల నవాడా జిల్లాలో 200 మంది హత్యకు గురయ్యారు. పింటూ అశోక్ ముఠాలో షార్ప్ షూటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ భూమిహార్లు, కుర్మీల అనే కులాల మధ్య పోటీ వల్ల ఏర్పడింది. తర్వాత ఎందరో అమాయకులు వీరి గొడవల వల్ల చనిపోయారు.
ఎట్టకేలకు పట్టుబడ్డ పింటూ
జార్ఖండ్, డియోఘర్లోని సత్సంగ్ కాలనీ దగ్గర పింటూ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడని ఐపీఎస్ అమిత్ లోధా తెలుసుకున్నాడు. ఆపై 2006లో పింటూని పట్టుకున్నారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పింటూ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!