టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న పూజా హెగ్డే.. గత కొంత నుండి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈమె నుంచి చివరిగా `రాధ్యేశ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` వంటి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. విచిత్రంగా ఈ మూవీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
అయినప్పటికీ బుట్టబొమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సౌత్తో పాటు నార్త్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ రీసెంట్గా ఓ హిట్ మూవీని మిస్ అయిందట. ఆ మూవీ మరేదో కాదు.. నిన్న విడుదలైన `సీతా రామం`. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇందులో జంటగా నటించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
యుద్ధం, ప్రేమ.. ఈ రెండిటికీ ముడిపెట్టి `సీతారామం`ను రూపొందించారు. నిన్న అట్టహాసంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల పాత్రలకు విశేష ఆధరణ లభిస్తోంది. సినీ లవర్స్ మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ టాక్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట పూజా హెగ్డేను ఎంపిక చేయాలని మేకర్స్ భావించి.. ఆమెను సంప్రదించారట. ఆమె ఓకే కూడా చెప్పిందట. కానీ, సరిగ్గా షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి పూజా హెగ్డే కోవిడ్ బారిన పడిందట. అయితే అప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంతో నిర్మాతలు ఎదురుచూడలేని పరిస్థితి. దాంతో పూజా హెగ్డేను తప్పించి మృణాల్ను ఎంపిక చేసుకున్నారని తాజాగా ఓ వార్త వైరల్గా మారింది. దీంతో పూజా హెగ్డేది బ్యాడ్ లుక్ అని, పాపం మంచి హిట్ మూవీని మిస్ చేసుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!