Prema Entha Madhuram: అమ్మ అది టివ్వు అని సుగుణ అను ని చూస్తుంది.ఆ మెట్టు ఇచ్చి ఆశ్చర్య పోయి వెంటనే మూసిగేసుకుంటుంది అను. రాధా ఏంటమ్మా ఇది నువ్వు ఇలా బిక్షాటన చేయడం ఏంటమ్మా అని సుగుణ.అంటుంది. అమ్మ అడుగుతుంటే ఏం మాట్లాడవ్ ఏంటి చెప్పు అని జ్యోతి అంటుంది. ఏదీ కారణం లేకుండా ఇలా చేయవమ్మా మరీ ఇంత కష్టపడడం ఏంటమ్మా అని యాదగిరి అంటాడు.నీ కష్టం చెప్పుకునే అంత దగ్గరగా మేము లేమా నీకు భిక్షాటన చేయాల్సిన అవసరమేంటి అని సుగుణ అడుగుతుంది. ఆంటీ దయచేసి మీరు ఏమి నన్ను అడగండి ఏమి చెప్పలేను నేనేం చేసినా ఒక్క కారణం ఉంటుందని మీరు నమ్ముతున్నారు కదా ఆ నమ్మకంతోనే ఈ విషయాన్ని వదిలేసేయండి అని అను అంటుంది. అది కాదమ్మా నిన్ను ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది నావల్ల కావట్లేదు అమ్మ అని సుగుణ అంటుంది. ఆంటీ నాకంత మంచే జరగాలని అనుకుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి దయచేసి అర్థం చేసుకోండి ఆంటీ అని అను అంటుంది. అత్తమ్మ ఇక ఆవిడని ఇబ్బంది పెట్టకండి వెళ్దాం పద అని యాదగిరి అంటాడు.
అమ్మ రాధా ఇదించు అని సుగుణ 100 రూపాయలు గిన్నెలు వేసి వెళ్ళిపోతుంది. ఏంటి మేడం మీరు బిక్షం ఎత్తుకోవడమేంటి నిజం నాకైనా చెప్పండి మేడం అని యాదగిరి అంటాడు. నా సమస్యలకు పరిష్కారం ఇదొక్కటే దయచేసి వెళ్ళిపో ప్లీజ్ అని అను రిక్వెస్ట్ చేస్తుంది. యాదగిరి 500 రూపాయలు గిన్నెలో వేసి వెళ్ళిపోతాడు. పదండి అత్తమ్మ ఆమె నమ్మకం ఆమెది ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని యాదగిరి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. అను గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటుంది. కట్ చేస్తే, ఓకే కెనడీని కిడ్నాప్ చేసి బ్రో ఇల్లాకి మంచి షాక్ ఇచ్చాము కదా అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో జలంధర్ పారిపోయి వచ్చి కంగారుపడుతూ కుర్చీలో కూర్చుంటాడు.ఏమైంది అన్నయ్య మంచినీళ్లు తీసుకురా మానసి అని ఛాయా అంటుంది. ఏమైందన్నయ్య అంత కంగారు పడుతున్నావ్ అని ఛాయా అంటుంది. అన్నయ్య కెనడినీ కిడ్నాప్ చేశారా అని మానస అంటుంది. ఆర్య వర్ధన్ నన్ను ఓడించడం కన్నా జాలి చూపించి వదిలేశాడు చూడు ఆ అవమానమే నన్ను వెంటాడుతుంది నా మీద నాకే కోపం వస్తుంది అని జలంధర్ అంటాడు. అన్నయ్య నువ్వేం బాధపడకు అని ఛాయా అంటుంది.
ఓ మై గాడ్ కెనడి పిల్లల ఫోటోలు వేస్తే ఆర్య వాళ్ళ పిల్లలని అనునే రాద అని తెలిసిపోతుంది నా ప్రయత్నాలను వేస్ట్ అయిపోయాయి అని మానస టెన్షన్ పడుతుంది. ఇక్కడ టెన్షన్ పడితే సరిపోదు అక్కడ ఉన్న నీ మనిషికి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కో ముందు ఫోన్ చెయ్ అని ఛాయా అంటుంది. మానస అతనికి ఫోన్ చేసి కెనడిని అక్కడికి తీసుకు వచ్చారా అని అడుగుతుంది. అవును మేడమ్ తీసుకొచ్చారు అని అతను అంటాడు. ఇడియట్ అక్కడ ఉండి ఏం చేస్తున్నావ్ అక్కడ ఏం జరుగుతుందో నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు అని మానస అంటుంది. మానస ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే సరిపోదు అని ఛాయా అంటుంది. మరేంటి కెనడి పిల్లల ఫోటోలు వేస్తాడు ఈ అనునేమో ఇక్కడ దీక్ష చేస్తుంది వాళ్ళిద్దరూ కలిసిపోతే మన పరిస్థితి ఏంటి అని మానస అంటుంది. దీక్షాటన పూర్తయితే కలిసిపోతారని నమ్మితే బిక్షాటన జరగకుండా ఆపేద్దాం అని జలంధర్ అంటాడు. అవునన్నయ్య వెంటనే నీ మనుషుల్ని పిలిపించి ఆ పని చేయించు అని ఛాయా అంటుంది. కట్ చేస్తే, ఆర్య వర్ధన్ కెనడిని తీసుకొని ఆఫీసుకు వస్తాడు.
నీరజ్ ని జెండిని పరిచయం చేస్తాడు ఆర్య. ఆర్య వర్ధన్ బిజినెస్ లో ఎదురులేని మనిషి అని నేను తెలుసుకున్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను అలాంటి వాడికి నేను ఉపయోగపడ0 నా అదృష్టం అని అతను అంటాడు. సరే అని ఆర్య అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య ఫ్రెండ్ మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు నీకు తెలుసా అని అక్కి అంటుంది. తెలుసకి చిన్నప్పటి మన ఫోటోలు తీసి నాన్న ఫోటో వేస్తారు అప్పుడు నాన్నకు నిజం తెలిసిపోతుంది అని ఆభయ్ అంటాడు. అక్కి నువ్వు సైలెంట్ గా ఉండు మనం తెలియనట్టే ఉందాం అని ఆభయ్ అంటాడు. నాకు అర్థమైంది సార్ అని కెనడి అంటాడు. పిల్లల్ని ఇద్దరినీ ఫోటో దించుకుంటాడు కెనడి. పిల్లలతో పని అయిపోయింది ఇక తీసుకు వెళ్తున్నాను ఏదైనా క్లూ దొరకగానే నాకు ఫోన్ చేయండి అని ఆర్య అంటాడు. పిల్లలు వాళ్లకు బాయ్ చెప్పండి వెళ్దాం అని ఆర్య అంటాడు. బాయ్ బాబాయ్ అని పిల్లలు అంటారు.
ఏంటి బాబాయా అని నీరజ్ అంటాడు. మా నాన్నకి తమ్ముడు పోయినప్పుడు మాకు బాబాయి వే కదా బాబాయ్ అని పిల్లలు అంటారు. మీరు అలాగే పిలవండి అని నీరాజ్ వాళ్ళని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుని పంపిస్తాడు. ఆర్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అను ట్రాఫిక్ లో అడుక్కుంటూ ఉంటుంది. ట్రాఫిక్ లో అను అడుక్కుంటూ ఉండగా అక్కడే ఉన్నా పిల్లలు ఇద్దరు చూసి అమ్మ అని పిలిచి ఏడుస్తారు. అభయ్ అక్కి ఏమైంది అని ఆర్య అంటాడు. అమ్మ ఇక్కడే ఉంది అని పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్తారు. అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అని అక్కి అడుగుతుంది. ఎవరూ లేనివారు బిచ్చమెత్తుకుంటారని నువ్వే చెప్పావు కదా అమ్మ అని అక్కి అంటుంది.
మేమందరం నీకు ఉన్నాం కదా మా మ నాకు డబ్బు కూడా ఉంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అని అభయ్ అంటాడు. చెప్పమ్మా నువ్వు ఇలా చేస్తుంటే మాకు ఏడుపొస్తుంది అని పిల్లలు అంటారు. పిల్లలు మీరు ఏమీ అడక్కండి అమ్మ ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తుంది మీరు వెళ్ళండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతుంది అను. అక్కడే ఆర్య నిలబడు చూస్తూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!