కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ది వారియర్`. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్గా చేశారు.
నదియా, అక్షర గౌడ తదతరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లోగ్రాండ్గా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.
కానీ, రెండో రోజు మాత్రం డల్ అయింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.02 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.30 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్గా రూ. 2.63 కోట్ల షేర్తో సరిపెట్టుకుంది. టికెట్ రేట్స్ అధికంగా ఉండటమే సినిమాకు మైనస్గా మారిందని, రేట్స్ ని తగ్గించి ఉంటే ఆఫ్ లైన్ బుకింగ్స్ మరింత జోరుగా సాగి ఉండేవని అంటున్నారు. ఇక ఏరియాల వారీగా `ది వారియర్` 2 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓసారి గమనిస్తే..
నైజాం- రూ. 2.85 కోట్లు
సీడెడ్- రూ. 1.46 కోట్లు
యూఏ- రూ. 1.34 కోట్లు
తూర్పు- రూ. 0.72 కోట్లు
వెస్ట్ : రూ- 0.76 కోట్లు
గుంటూరు- రూ. 1.38 కోట్లు
కృష్ణా- రూ. 0.45 కోట్లు
నెల్లూరు- రూ. 0.36 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ= రూ. 9.32 కోట్ల(రూ.13.90~ గ్రాస్)
—————————-
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా: రూ. 0.50 కోట్లు
ఓవర్సీస్- రూ. 0.39 కోట్లు
తమిళ వర్షన్- రూ. 0.44 కోట్లు
————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ. 10.65 కోట్లు(రూ.16.55 కోట్లు~ గ్రాస్)
————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. తొలి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 28.35 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!