మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. ఇందులో దివ్యాన్షి కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తే.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి, నాజర్, భరణి, నరేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం.. 2022 జులై 29న విడుదలైంది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
అయితే లాంగ్ రన్ లో రూ. 5.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. బయ్యర్లకు ఏకంగా రూ.12.53 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదలకు డేట్ లాక్ అయింది. `రామారావు ఆన్ డ్యూటీ` డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న సోనీలివ్.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కూడా ప్రకటించింది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్లో ఫ్లాప్ అయినా ఓటీటీ వేదికగా హిట్ అవుతున్నాయి. మరి బిగ్ స్క్రీన్ పై అలరించలేకపోయిన `రామారావు ఆన్ డ్యూటీ`.. ఓటీటీ ద్వారా అయినా ప్రేక్షకులను అలరిస్తుందో..లేదో..చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!